E-Paper
Advertisement

Janvada Farm House Case: ఎట్టకేలకు రేవ్ పార్టీపై స్పందించిన కేటీఆర్.. నేనక్కడ లేను.. బిగ్ టీవీపై అక్కసు

Janvada Farm House Case: ఎట్టకేలకు రేవ్ పార్టీపై స్పందించిన కేటీఆర్.. నేనక్కడ లేను.. బిగ్ టీవీపై అక్కసు
Advertisement

Janvada Farm House Case: కుటుంబంతో కలిసి ఫంక్షన్ జరుపుకుంటే, దానికి రేవ్ పార్టీ అంటారన్న విషయం ఈరోజే తనకు తెలిసిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లోని జన్వాడ లో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసుపై తాజాగా కేటీఆర్ స్పందించారు. తన నివాసం వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తాము ప్రశ్నిస్తున్నందుకే, కక్షపూరిత రాజకీయాలకు సీఎం రేవంత్ తెర తీశారన్నారు. రాజకీయంగా సమాధానం చెప్పే సామర్థ్యం లేక, తమను తమ కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురి చేసేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారన్నారు. తన బావమరిది రాజ్ పాకాల నివాస గృహంలో దీపావళి సందర్భంగా దావత్ నిర్వహించారని, దావత్ ను రేవ్ పార్టీ అంటారా అంటూ ప్రశ్నించారు. ఆ ఫంక్షన్ లో వృద్ధులు, చిన్నారులు కూడా ఉన్నారని, ఈ కేసు బూచిగా చూపి, కొండను తవ్వి ఎలుకను పట్టుకున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఉందన్నారు.

కుటుంబం మొత్తం ఒకే చోట కలిస్తే అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంటుందో రాష్ట్ర ప్రజలు గమనించాలన్నారు. ఉదయం ఎక్సైజ్ సీఐ శ్రీలత ఎటువంటి డ్రగ్స్ లభించలేదని ప్రకటించారని, సాయంత్రానికి డ్రగ్స్ కేసుగా ఎలా మారిందన్నారు. అంతమందిలో ఒకరికి డ్రగ్స్ పాజిటివ్ గా వచ్చినట్లు పోలీసులు తెలిపారని, అయితే ఆ డ్రగ్స్ తీసుకున్న విజయ్ బయట కూడా డ్రగ్స్ తీసుకుని ఉండవచ్చని కేటీఆర్ అన్నారు.

Advertisement

తనను ఎదుర్కోలేక అధికారం ఉందని మానసికంగా దెబ్బతీసేందుకు సీఎం రేవంత్ ప్రయత్నిస్తున్నారని, ఇటీవల దీపావళికి పొలిటికల్ బాంబ్ అంటూ కాంగ్రెస్ పార్టీ విస్తృత ప్రచారం చేసి చివరకు ఇదేనా మీ పొలిటికల్ బాంబ్ అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. గొంతు నొక్కి రాజకీయంగా వేధించి కాంగ్రెస్ ప్రభుత్వం సాధించేది ఏది లేదని, ఇటువంటి కక్షపూరిత చర్యలను మానుకోవాలన్నారు. ఇక తాను ఆ పార్టీలో పాల్గొన్నట్లు వస్తున్న వార్తలను కేటీఆర్ ఖండించారు. తాను ఆ పార్టీ జరిగే సమయానికి ఎర్రవల్లిలో తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్ ను కలిసి ఇంటికి వచ్చినట్లు, ఇటువంటి వార్తలు ప్రసారం చేసే ముందు మీడియా కూడా నిర్ధారించుకోవాలన్నారు.

Also Read: KCR on Janvada Farm House Case: రేవ్ పార్టీ కేసుపై స్పందించిన కేసీఆర్.. డీజీపీకి ఫోన్.. ట్విట్టర్ లో స్పందించిన హరీష్ రావు

Advertisement

కేటీఆర్ ప్రకటనతో ఉదయం నుండి వస్తున్న కథనాలకు కొంత ఫుల్ స్టాప్ పడిందని భావించినా, మీడియా సమావేశంలో కేటీఆర్ ను ఓ మీడియా ప్రతినిధి.. డ్రగ్స్ టెస్ట్ లో ఒకరికి పాజిటివ్ వచ్చింది కదా అనే లోగానే కేటీఆర్ ఇక సెలవంటూ వెళ్లిపోయారు. అయితే పోలీసులు మాత్రం ఈ కేసు దర్యాప్తును వేగవంతంగా సాగిస్తుండగా, ఇక పూర్తి విషయాలు పోలీసుల ప్రకటనతో బహిర్గతం కావాల్సి ఉంది.

బిగ్ టీవీ ప్రతినిధిని వెళ్లిపొమ్మన్న కేటీఆర్..

ఉదయం నుండి జన్వాడ ఫామ్ హౌస్ కేసుకు సంబంధించి, పలు వార్తా కథానాలు ఉన్నది ఉన్నట్లుగా ప్రసారం చేసిన బిగ్ టీవీకి తన మీడియా సమావేశంలో పాల్గొనేందుకు అనుమతి లేదని కేటీఆర్ అన్నారు. కేటీఆర్ స్పందనను ప్రసారం చేసేందుకు బిగ్ టీవీ ప్రతినిధులు అక్కడికి వెళ్లగా, కేటిఆర్ అనుచరులు సైతం మీకు అనుమతి లేదంటూ అడ్డుకోవడం విశేషం. అయినా కేటీఆర్ ప్రసంగాన్ని ఉన్నది ఉన్నట్లు ప్రసారం చేసి, బిగ్ టీవీ తన ధర్మాన్ని పాటించింది.

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×