BigTV English
Advertisement

KTR VS Bandi Sanjay: బండి సంజయ్‌కు కేటీఆర్ బిగ్ షాక్.. రూ.10 కోట్ల పరువు నష్టం దావా

KTR VS Bandi Sanjay: బండి సంజయ్‌కు కేటీఆర్ బిగ్ షాక్.. రూ.10 కోట్ల పరువు నష్టం దావా

KTR VS Bandi Sanjay: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హైడ్రామా నడుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ కుమార్‌పై రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేశారు. కేటీఆర్ సిటీ సివిల్ కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేయగా.. డిసెంబర్ 15న విచారించనున్నట్టు సివిల్ కోర్టు తెలిపింది.


బీఆర్ఎస్ హయంలో మాజీ మంత్రి కేటీఆర్ డ్రగ్స్ తీసుకున్నారని.. రాష్ట్రంలో చాలా మంది ఫోన్లను ట్యాప్ చేశారని.. గతేడాది అక్టోబర్ నెలలో కేంద్ర మంత్రి బండి సజయ్ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ పరువు నష్టం నోటీసులు పంపారు. గడిచిన నెలలో బండి సంజయ్ మరోసారి కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రూప్ -1 పేపర్ లీకేజీ ఆందోళన సమయంలో తన ఫోన్ ను ట్యాప్ చేసి.. పోలీసులు ముందుస్తుగానే ఇంటికి వచ్చారని బండి సంజయ్ విలేకరుల సమావేశంలో అన్నారు. పేపర్ లీకేజీకి సంబంధించిన కేసులో చివరికు జడ్జి ఫోన్ కూడా ట్యాప్ చేసినట్టు సంచలన ఆరోపణలు కూడా చేశారు.

బండి సంజయ్ ఆరోపణలపై ఆగస్ట్ 12న మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. తన పై చేసిన సంచలన ఆరోపణలపై బండి సంజయ్ 48 గంటల్లోనే క్షమాపణలు చెప్పాలని.. లేకపోతే కోర్టుకు లాగుతా అని కేటీఆర్ అన్నారు. అయితే నోటిసులపై బండి సంజయ్ ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదు. దీంతో కేటీఆర్ న్యాయపోరాటానికి దిగారు. ఈ క్రమంలోనే బండి సంజయ్ పై పరువు నష్టం దావా వేశారు. తన పరువు ప్రతిష్టను దిగజార్చాలనే ఉద్దేశంతోనే బండి సంజయ్ ఈ సంచలన ఆరోపణలు చేసినట్టు కేటీఆర్ ఆరోపించారు.


కేటీఆర్ ఇప్పటివరకు వేసిన రెండో పరువు నష్టం దావా కేసు ఇది. ఇంతకు ముందు నటి సమంత రూత్ ప్రభు, నటుడు నాగ చైతన్య విడాకులకు సంబంధించిన విషయంపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో మంత్రి సురేఖపై కూడా కేటీఆర్ రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు.

ALSO READ: Vijayawada News: ఫుడ్ ఆర్డర్ మారింది.. ఇలా ఏంటని ప్రశ్నిస్తే.. పీక కోసేస్తారా భయ్యా..?

కేటీఆర్ ఫిర్యాదులో ఏమున్నాయ్..?

గత నెలలో బండి సంజయ్ నాపై తప్పుడు, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్, తెలంగాణ ఎస్ఐబీ (స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్) దుర్వినియోగం, గ్రూప్-1 పేపర్ లీకేజీ లాటి పలు విషయాల్లో నాకు సంబంధం లేకున్నా ఆరోపణలు చేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలు పలు మీడియా ఛానెళ్లు, సోషల్ మీడియా వేదికల్లో హైలెట్ అయ్యాయి. ఆయన వ్యాఖ్యలు కేవలం పరువు, ప్రతిష్టకు భంగం కలిగించడమే కాకుండా.. నా క్యారెక్టర్ ను దెబ్బతీసేలా ఉన్నాయి’ అని కేటీఆర్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ALSO READ: Jubilee Hills Bypoll: బీఆర్ఎస్ ఎండ్ గేమ్ – జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. కేటీఆర్ అనుమానం అదేనా?

Related News

Warangal: వరంగల్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి.. కార్మికుల కష్టాన్ని గుర్తిస్తామన్న సీఎం!

Jubilee Hills bypoll: ఇప్పుడు ఏడ చూసినా ఒక్కటే ముచ్చట.. జూబ్లీలో పాగా వేసేదెవరు..? నిజంగా జూబ్లీ కింగ్ ఎవరు?

Hydra: రూ. 30 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా

Telangana Politics: రేవంత్ ప్రభుత్వంలో కాంగ్రెస్ సీనియర్లకు పెద్ద పీఠ.. ఆ నేతలకు కీలక పదవులు

Raja Singh: ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ‘భగవద్గీత’ వ్యాఖ్యలపై రాజాసింగ్ ఫైర్

Telangana: విద్యార్థులకు అలర్ట్..! తెలంగాణ ఇంటర్ పరీక్షలకు షెడ్యూల్ విడుదల

Minister Azharuddin: మంత్రి అజారుద్దీన్ స్ట్రాంగ్ కౌంటర్, ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదు

Konda Surekha vs Errabelli Swarna: ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకల్లో పూల దండ లొల్లి..! స్వర్ణ VS కొండా

Big Stories

×