E-Paper
Advertisement

Huzurabad Hospital: హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల తీవ్ర ఇబ్బందులు .. పట్టించుకోని అధికారులు!

Huzurabad Hospital: హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల తీవ్ర ఇబ్బందులు .. పట్టించుకోని అధికారులు!
Advertisement

Huzurabad Hospital: హుజురాబాద్, స్వేచ్ఛ : హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో అధికారుల నిర్లక్ష్యం పరాకాష్టకు చేరింది. గత కొన్ని రోజులుగా ఆసుపత్రిలోని లిఫ్టు చెడిపోయి నిరుపయోగంగా ఉన్నా, సంబంధిత అధికారులు కనీసం మరమ్మతులు చేయించకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

నరకప్రాయంగా మారిన రాకపోకలు

లిఫ్టు పనిచేయకపోవడంతో ఆపరేషన్ అయిన మహిళలు, గర్భిణీ స్త్రీలు, డెలివరీ అయిన బాలింతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండో అంతస్తు నుంచి మెట్ల ద్వారా కిందకు దిగాలంటే వారు నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను స్ట్రెచర్ల మీద మోసుకెళ్లడం అటెండర్లకు భారంగా మారింది. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే నిరుపేద ప్రజల పట్ల అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం శోచనీయమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Also Read: Heavy Rain Alert: తెలంగాణ‌కు వెద‌ర్ అల‌ర్ట్.. 2 రోజుల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో వడగళ్ల వాన పడే ఛాన్స్

ప్రైవేటుకు ఉన్న శ్రద్ధ ప్రభుత్వానికి లేదా?

ఈ సందర్భంగా ప్రజా సంఘాల ప్రతినిధి వేల్పుల ప్రభాకర్ మాట్లాడుతూ, “ప్రైవేట్ ఆసుపత్రిలో చిన్న సమస్య తలెత్తినా ఐదు నిమిషాల్లో పరిష్కరించే మేనేజ్మెంట్ ఉంటుంది. కానీ, వందలాది మంది వచ్చే ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంత పెద్ద సమస్య ఉన్నా సూపర్నెంట్ గారు స్పందించకపోవడం దారుణం. పేషెంట్ల ట్రీట్మెంట్ విషయంలో మరియు సౌకర్యాల విషయంలో నిర్లక్ష్యం వహించడం తగదు” అని మండిపడ్డారు.

ప్రజా సంఘాల విన్నపం

Advertisement

తక్షణమే ఆసుపత్రి అధికారులు, ఉన్నతాధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన లిఫ్టుకు మరమ్మతులు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యం మరియు భద్రత దృష్ట్యా నిర్లక్ష్యాన్ని వీడి, ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Also Read: Flying Kiss Case Sentence: తొమ్మిదేళ్ల క్రితం మైనర్ బాలికకు ఫ్లయింగ్ కిస్.. ముంబై కోర్టు సంచలన తీర్పు!

Related News

జీహెచ్ఎంసీలో రెనొవేషన్ దందా కలకలం.. ఆఫీసర్ల మోజుకు కోట్లు ఖర్చు!

నడిరోడ్డుపై డెలివరీ బాయ్స్ నరకం.. తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం

పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. క్షణాల్లో ప్రమాదం..!

ఉద్యోగులకు రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి-డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

శామీర్‌పేట్‌లో కాంగ్రెస్ నాయకులు ఫైర్.. BRS ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దుచేయాలని డిమాండ్!

1980s ట్రెండ్.. అచ్చం హీరోలా సీఎం రేవంత్, ఓల్డ్ ఈజ్ గోల్డ్

అదుపు తప్పిన లారీ.. డ్రైవర్‌ సహా 200 గొర్రెలు సజీవదహనం.. మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర ప్రమాదం

మూసీ నది ప్రాజెక్టు.. దసరా రోజు నుంచి పనులకు శ్రీకారం, ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం

Big Stories

Advertisement
×