Language Healthcare: డాక్టర్లంతా రోగికి అర్ధమయ్యే భాషలో మాట్లాడితేనే సగం రోగం నయమవుతుందని ఫాదర్ ముల్లర్ మెడికల్ కాలేజీ(Father Muller Medical College) స్టడీలో తేలింది. డాక్టర్లు స్టానిక భాషాలోనే పేషెంట్ తో మాట్లాడాలని, అప్పుడే పేషెంట్ కు భరోసా కలుగుతుందని సర్వేలో గుర్తించారు. కర్ణాటకలోని వివిధ వైద్య కళాశాలలకు చెందిన 409 మంది ఎంబీబీఎస్(MBBS) విద్యార్థుల లాంగ్వేజ్ పై స్టడీ చేశారు. డాక్టర్, పేషెంట్ సంభాషణను ప్రత్యేకంగా పరిశీలించారు. ఇందులో 92 శాతం మంది విద్యార్ధులు రోగి మాతృభాషలో మాట్లాడితే సంతృప్తి చెందుతారని వెల్లడించారు.
Also Read: Arjun sarja : పవన్ కళ్యాణ్ పై అర్జున్ సర్జా కామెంట్స్.. కళ్ళు మూసుకుని వెళ్ళొచ్చు అంటూ
బాష అడ్డంకులు కూడా మెడికల్ విద్యార్ధులపై ఒత్తిడిని పెంచుతాయని, పేషెంట్, డాక్టర్ మధ్య కాన్వర్జేషన్ సరిగ్గా లేకపోవడంతోనే మెడికేషన్ లోనూ సమస్యలు వస్తున్నట్లు విద్యార్ధులు వివరించారు. పేషెంట్ హిస్టరీ సేకరణలో లాంగ్వేజ్ కీలకంగా మారుతుందన్నారు. ట్రాన్స్ లేటర్లు, మొబైల్ యాప్ లు ఉన్నప్పటికీ, పేషెంట్కు, డాక్టర్కు మధ్య మెడికేషన్ రిలేషన్ ఫర్ ఫెక్ట్గా పెంపొందించలేవని సర్వేలో తేలింది. ప్రమాదం ఉందని స్పష్టంగా చెప్పగలిగితేనే క్వాలిటీ చికిత్సను అందించవచ్చని వివరించారు. ఈ సందర్భంగా గాంధీ ఫ్రోఫెసర్ డాక్టర్ కిరణ్ మాదాల మాట్లాడుతూ.. వైద్య అవసరాలకు అనుగుణంగా మెడికోస్ కు లోకల్ లాంగ్వేజ్ కు ట్రైనింగ్ అవసరమన్నారు. ఇది రోగి సంరక్షణ నాణ్యతను, వైద్య శిక్షణ ప్రమాణాలను, డాక్టర్–రోగి సంబంధాలను నేరుగా ప్రభావితం చేస్తుందన్నారు.
Also Read: Tollywood: మళ్లీ షూటింగ్స్ ఆగిపోతున్నాయా? వారు సమ్మెకు సిద్ధమవుతున్నారా?