E-Paper
Advertisement

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుకు 2019లో తొలి డ్యామేజ్ గుర్తింపు.. ఎల్ అండ్ టీ కీలక విషయాలు వెల్లడి

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుకు 2019లో తొలి డ్యామేజ్ గుర్తింపు.. ఎల్ అండ్ టీ కీలక విషయాలు వెల్లడి
Advertisement

Kaleshwaram Project: కాళేశ్వరం కమిషన్ ముందు L &T సంస్థ ప్రతినిధుల విచారణ ముగిసింది. ముగ్గురు ప్రతినిధులను కమిషన్ విచారించింది. నిర్మాణం, నాణ్యత, బ్లాక్ 7 కుంగుబాటుపై కమిషన్ వరుస ప్రశ్నలు సంధించిది. నిర్మాణంలో నాణ్యత పాటించారా..? అని కమిషన్ ప్రశ్నించగా.. క్వాలిటీ కంట్రోల్ వంద శాతం పాటించామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. నిర్మాణంలో నాణ్యత పాటిస్తే బ్లాక్ 7 ఎలా కుంగింది, కుంగడానికి కారణాలు ఏంటని కమిషన్‌ ప్రశ్నించగా.. డిజైన్స్ అండ్ డ్రాయింగ్‌లో లోపాలు ఉన్నాయని.. వాటితో పాటు ఎక్కువ వరదలు, బ్యారేజ్ వద్ద నీటిని నిల్వ చేయడం వల్ల 7 బ్లాక్ కుంగిందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

మేడిగడ్డ బ్యారేజీ మొట్టమొదటి డ్యామేజ్ ఎప్పుడు జరిగిందని కమిషన్ ప్రశ్నించగా.. 2019లో మొదటిసారి డ్యామేజీ గుర్తించామని.. వెంటనే సమస్య పరిష్కరిస్తే ఇంతటి డ్యామేజ్ అయ్యేది కాదని వివరణ ఇచ్చారు. సబ్ కాంట్రాక్టర్లకు ఏమైనా ఇచ్చారా..? అని ప్రశ్నించగా.. ఇతర రాష్ట్రాల నుంచి లేబర్‌ సహాయం తీసుకున్నామని.. సబ్ కాంట్రాక్టర్లకు ఇవ్వలేదని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రాజెక్ట్ కుంగడానికి గల కారణాలపై మేము కూడా రీసెర్చ్ చేశామని.. ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాని L &T సంస్థ ప్రతినిధులు తెలిపారు. కాపర్ డ్యాం కాంట్రాక్ట్ పరిధిలోకి వస్తుందా?

Advertisement

Also Read: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్‌కు ప్రమాదం.. వరుసగా 6 కాన్వాయ్‌లు..

అడిషనల్ వర్క్ కిందకి వస్తుందా? అని కమిషన్ ప్రశ్నించగా.. కాంట్రాక్ట్ కిందికే వస్తుంది కానీ.. కాపర్ డ్యామ్‌ నిధులు ఇప్పటికీ విడుదల చేయలేదని L &T సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన డిజైన్ ప్రకారమే కన్స్ట్రక్షన్ జరిగిందని.. మేడిగడ్డ నిర్మాణం పూర్తి అయినట్లు ఇంజనీర్లు కంప్లిషన్ రిపోర్ట్‌ ఇచ్చారని తెలిపారు. కుంగిన బ్లాక్ లు తిరిగి నిర్మించుకోవచ్చా అన్న ప్రశ్నకు.. L & T ప్రతినిధులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.

Related News

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్.. మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే ఏరియాల్లో

టెక్కీ మృతి కేసులో సంచలన విషయాలు.. అనుక్షణం వెంటాడిన ఆ భయం.. తట్టుకోలేక అర్ధరాత్రి వేళ..

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Big Stories

Advertisement
×