E-Paper
Advertisement

Anganwadi Food Poisoning: అంగన్‌వాడీలో విషాదం.. వడియాలు తిని ఇద్దరు చిన్నారుల మృతి

Anganwadi Food Poisoning: అంగన్‌వాడీలో విషాదం.. వడియాలు తిని ఇద్దరు చిన్నారుల మృతి
Advertisement

Anganwadi Food Poisoning: పేద పిల్లలకు పౌష్టికాహారం అందించాల్సిన అంగన్‌వాడీ కేంద్రం చిన్నారుల పాలిట మృత్యు కేంద్రంగా మారింది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఇటుకాల గడ్డతండాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్థానిక అంగన్‌వాడీ కేంద్రంలో ఆహారం వికటించి ఇద్దరు చిన్నారులు మృతి చెందడం స్థానికులను కలచివేసింది.

తండాకు చెందిన భూక్యా సురేశ్, నీలమ్మ దంపతుల కుమార్తె నిత్య (4), మరో చిన్నారి చైత్ర గత నెల 14న అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లారు. అక్కడ ఆయమ్మ పెట్టిన వడియాలు తిన్న కాసేపటికే ఇద్దరూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ చైత్ర గత నెల 29న మృతి చెందగా.. దాదాపు నెల రోజులుగా ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతూ నిత్య గురువారం (డిసెంబర్ 19) కన్నుమూసింది. వీరితో పాటే ఆహారం తీసుకున్న కీర్తి, భువనేశ్వరి అనే మరో ఇద్దరు పిల్లలు కూడా అస్వస్థతకు గురయ్యారు, ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉంది.

Advertisement

అంగన్‌వాడీ కేంద్రంలో నిల్వ ఉంచిన తినుబండారాలపై ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయని, కలుషిత ఆహారం (ఫుడ్ పాయిజన్) వల్లే తమ పిల్లలు చనిపోయారని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. అయితే, జిల్లా అధికారి సబితా మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. చిన్నారులు గతం నుంచే అనారోగ్యంతో ఉన్నారని తమ విచారణలో తేలిందని పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనల నేపథ్యంలో గత 20 రోజులుగా అంగన్‌వాడీ కేంద్రం మూతపడింది. తమ పిల్లల మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని మృతుల బంధువుల ఆందోళన బాటపట్టారు.

Read Also: Students Conflict: చిచ్చు పెట్టిన మేకు.. నర్సంపేట గురుకులంలో పొట్టు పొట్టు కొట్టుకున్న స్టూడెంట్స్

Related News

బర్తరఫ్ తర్వాత తొలిసారి నోరు విప్పిన కొండా సురేఖ..సీయం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

Big Stories

Advertisement
×