Yashwanth Naik: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం భూక్య తండాకు చెందిన యశ్వంత్ నాయక్ (Yashwanth Naik) జనవరి 31న మరో శిఖరాన్ని అధిరోహించాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అర్మకొండ శిఖరాన్ని అధిరోహించాడు. యశ్వంత్ భారతీయ యువకులను సాహసం, పట్టుదల, క్రమశిక్షణ ద్వారా దేశంలోని 28 భారతీయ రాష్ట్రాల లోని ఎత్తైన శిఖరాలను, ఏడు ఖండాలలోని ఏడు శిఖరాలను అధిరోహించాలని అంకితమైన లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు.
ఈ విజయంతో యశ్వంత్ ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, అస్సాం, రాజస్థాన్, ఒడిశా లోని అత్యున్నత శిఖరాలను విజయవంతంగా అధిరోహించి తన లక్ష్యం దిశగా సాహసం చేస్తున్నాడు. ప్రతిష్టాత్మకమైన 28 రాష్ట్రాలపై హై పాయింట్స్ ఛాలెంజ్ ను పూర్తి చేయడంలో తన స్థిరమైన పురోగతిని కొనసాగిస్తున్నాడు.
ప్రధాన అంతర్జాతీయ, అధిక ఎత్తైన శిఖరాల విజయాలు యశ్వంత్ అనేక సవాళ్లతో కూడిన అంతర్జాతీయంగా, అధిక ఎత్తైన శిఖరాగ్ర యాత్రలను విజయవంతంగా పూర్తి చేశాడు. మౌంట్ కిలిమంజారో, మౌంట్ ఎల్బ్రోస్, మౌంట్ కోస్కియూస్కో, మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ లను విజయవంతంగా పూర్తి చేశాడు. తాజాగా జనవరి 31న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అర్మకొండ ఎత్తైన శిఖరాన్ని అధిరోహించి మరో మైలురాయిని దాటిపోయాడు. ఇంకా లక్ష్యం తన ముందే ఉందని అది నెరవేరేవరకు తన సాహసం ఎక్కడ తగ్గదని వెల్లడిస్తున్నాడు.
Also Read: CPI And CPM: కామ్రేడ్ లను కలుపుకోవట్లే.. ప్రధాన పార్టీలన్నీ పొత్తులకు ససేమిరా!