E-Paper
Advertisement

అసలు రాష్ట్రాన్ని దోచుకున్నదే కేసీఆర్ కుటుంబం.. మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

అసలు రాష్ట్రాన్ని దోచుకున్నదే కేసీఆర్ కుటుంబం.. మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
Advertisement

అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యుల ప్రవర్తన సభా మర్యాదలకు విరుద్ధంగా ఉందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. పెద్దల సభలో సభ్యులు సస్పెండ్ కావడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విజ్ఞులు, మేధావులు ఉండాల్సిన సభలో ప్రతిపక్ష నేతలు పేపర్లు చింపడం, బల్లలు చరచడం వంటి చర్యలకు పాల్పడటం వారి స్థాయికి తగదని మండిపడ్డారు. బీఆర్ఎస్ తీరు చూస్తుంటే ప్రజాస్వామ్య విలువలను గౌరవించే ఉద్దేశం వారికి లేదని అర్థమవుతోందన్నారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టత ఇచ్చారని మహేష్ కుమార్ గౌడ్ గుర్తుచేశారు. 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన అక్రమాలపై సీబీసీఐడీ విచారణకు ఆదేశించామని తెలిపారు. గత పదేళ్ల కాలంలో రాష్ట్రంలోని నీళ్లు, ఇసుక, గాలి వంటి వనరులను విచక్షణారహితంగా దోచుకున్నది కేసీఆర్ కుటుంబమేనని ఆరోపించారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన వారే ఇప్పుడు నీతులు మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఇసుక దోపిడీలో బీఆర్ఎస్ నేతల హస్తం రాష్ట్రవ్యాప్తంగా అందరికీ తెలుసని స్పష్టం చేశారు.

Advertisement

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గిగ్ వర్కర్స్ బిల్లును మహేష్ కుమార్ గౌడ్ ఒక చారిత్రాత్మక నిర్ణయంగా అభివర్ణించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మొదటి నుంచి గిగ్ వర్కర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగానే సీఎం రేవంత్ రెడ్డి ఈ కీలక బిల్లును సభ ముందుకు తెచ్చారని కొనియాడారు. అసంఘటిత రంగంలోని లక్షలాది మంది కార్మికులకు ఈ చట్టం వల్ల భవిష్యత్తులో గొప్ప భద్రత లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల గిగ్ వర్కర్లు సంతోషంగా ఉన్నారని తెలిపారు.

తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమంపై తమ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని పీసీసీ అధ్యక్షుడు పునరుద్ఘాటించారు. ఉద్యమకారుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ఒక కమిటీ పనిచేస్తోందని చెప్పారు. అర్హులైన ప్రతి ఉద్యమకారుడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే సన్నబియ్యం పథకానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని పేర్కొన్నారు. ఈ పథకం నాణ్యత బాగుందని క్షేత్రస్థాయిలో అందరూ అంటున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఇది ఒక అద్భుతమైన స్కీమ్ అని.. భవిష్యత్తులో కూడా దీనిని నిరంతరాయంగా కొనసాగిస్తామని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.

Advertisement

ALSO READ: అసెంబ్లీలో రేషన్ సన్నబియ్యం గుమగుమలు.. విందు ఆరగించిన సీఎం, అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు

Related News

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

Big Stories

Advertisement
×