E-Paper
Advertisement

నగరంలో కలకలం.. ప్రాణం తీసిన పంటి వైద్యం!

నగరంలో కలకలం.. ప్రాణం తీసిన పంటి వైద్యం!
Advertisement

Man Allegedly Dies Due to Teeth Procedure: జూబ్లీహిల్స్‌లోని రోడ్‌ నెం.37లో ఎఫ్‌ఎంఎస్‌ ఇంటర్నేషనల్‌ డెంటల్‌ క్లినిక్‌ (FMS International Dental Clinic)లో 28 ఏళ్ల వ్యక్తి దంత చికిత్స పొందుతూ మృతి చెందాడు.

బాధితుడిని లక్ష్మీనారాయణ వింజం గా గుర్తించారు. దంత వైద్యుడి నిర్లక్ష్యమే కారణమని మృతుడి కుటుంబీకులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఎక్కువ మోతాదులో అనస్థీషియా ఇవ్వడమే ఆయన అకాల మరణానికి కారణమైందని ఆరోపించారు.

Advertisement

లక్ష్మి నారాయణ అనే వ్యాపారవేత్త స్మైల్-డిజైనింగ్ (Smile-Designing) అనే ప్రక్రియ కోసం ఈ క్లినిక్‌ని సంప్రదించాడు. చికిత్స సమయంలో అతనికి అనస్థీషియా ఇవ్వబడింది. ఆ తర్వాత అతను స్పృహ కోల్పోయాడు. బాధితుడిని వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించారు. వైద్యులు బాధితుడిని పరిశీలించగా.. మరణించినట్లు తెలిపారు.

Read More: ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై అధిష్టానంతో చర్చలు..

Advertisement

తన కుమారుడి మృతికి దంతవైద్యుడే కారణమంటూ బాధితుడి తండ్రి వింజం రాములు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎక్కువ మోతాదులో అనస్థీషియా ఇవ్వడంలో దంతవైద్యుడి నిర్లక్ష్యం వల్లే తన కొడుకు ప్రాణాలు కోల్పోయాడని ఫిర్యాదులో తెలిపాడు. సంబంధిత వైద్యులపై చర్యలు తీసుకోవాలని రాములు పోలీసులను కోరారు.

పోలీసులు భారతీయ శిక్షాస్మృతి (ICC)లోని సెక్షన్ 304 (A) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags

Related News

మీర్‌పేట్‌లో అర్ధరాత్రి దారుణం.. బర్త్‌డే వేడుకలకు పిలిచి రౌడీషీటర్ దారుణ హత్య

GHMC ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు.. నోటిఫికేషన్‌కు తాత్కాలిక బ్రేక్!

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన.. వరంగల్ ఎయిర్‌పోర్టు నిధులు, టెండర్లు ఆహ్వానంపై

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Big Stories

Advertisement
×