E-Paper
Advertisement

MRPS: మందకృష్ణ మాదిగ అరెస్ట్..

MRPS: మందకృష్ణ మాదిగ అరెస్ట్..
Advertisement

హైదరాబాద్, స్వేచ్ఛ: ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను బుధవారం హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సీ వర్గీకరణను అమలు చేయకుండా డీఎస్సీ ద్వారా టీచర్ ఉద్యోగాల పోస్టులను భర్తీ చేయడాన్ని నిరసిస్తూ మందకృష్ణ ఆధ్వర్యంలో ఇవాళ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ నుంచి మాదిగల నిరసన ప్రదర్శన చేపట్టారు. అయితే ఈ నిరసనను పోలీసుల అడ్డుకున్నారు. మందకృష్ణ మాదిగతోపాటు పలువురు ఎమ్మార్పీఎస్ నేతలను ఖాకీలు అదుపులోకి తీసుకున్నారు.

స్వల్ప ఉద్రిక్తత

Advertisement

కృష్ణ మాదిగ పిలుపు మేరకు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఇందిరాపార్క్ ధర్నాచౌక్ నుంచి లోయర్ ట్యాంక్ బండ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వరకూ ర్యాలీగా బయలుదేరారు. కాగా, ఈ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో ఎమ్మార్పీఎస్ నేతలు, పోలీసులకు మధ్య వాగ్వివాదం, తోపులాట, కాసేపు స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. అనంతరం పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని, నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్‌లకు తరలించారు.

Also Read: బడా కబ్జాల సంగతేంటి..? ప్రభుత్వానికి బీజేపీ ఎమ్మెల్యే రమణా రెడ్డి సవాల్

Advertisement

సర్కారు క్లారిటీ..

వర్గీకరణపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించి, ముందుగా రాష్ట్రంలో వర్గీకరణ కోటాను ప్రకటించాలని ఎమ్మార్సీఎస్ అధినేత డిమాండ్ చేస్తు్న్నారు. ఈ పనిచేయకుండానే తెలంగాణ ప్రభుత్వం హడావుడిగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తోందని, దీనివల్ల మాదిగలు నష్టపోతున్నారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా, దీనిపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే 60 రోజుల వరకు తెలంగాణలో నోటిఫికేషన్లు ఇవ్వబోమని.. ఎస్సీ వర్గీకరణ చేసిన తరువాత నోటిఫికేషన్లను విడుదల చేస్తామని సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×