E-Paper
Advertisement

Hyderabad ORR Manmohan Singh: హైదరాబాద్ ఓఆర్ఆర్ మన్మోహన్ సింగ్ పుణ్యమే..

Hyderabad ORR Manmohan Singh: హైదరాబాద్ ఓఆర్ఆర్ మన్మోహన్ సింగ్ పుణ్యమే..

Hyderabad ORR Manmohan Singh| దివంగత మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ దేశాభివృద్ధిలో భాగంగా హైదరాబాద్ కు ఔటర్ రింగ్ రోడ్డ (ఓఆర్ఆర్) తీసుకురావడంలో ముఖ్యపాత్ర పోషించారు. హైదరాబాద్ నగరానికి అర్బన్ కనెక్టివిటీ, అభివృద్ధికి ముఖ్యకారణమైన ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు వెనుక మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ కృషి ఎంతో ఉంది. ఈ భారీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుతో హైదరాబాద్ నగర రూపురేఖలే మారిపోయాయి. ఓఆర్ఆర్ కంటే ముందు నగర విస్తరణ ఒక కలగానే ఉండేది. కానీ ఈ ప్రాజెక్టుకు జపాన్ నుంచి నిధులు తీసుకురావడంలో స్వయంగా అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారు.

జపాన్ ఇంటర్నేషన్నల్ కో ఆపరేషన్ ఏజెన్సీ (జెఐసిఏ) నిధులు ఇవ్వడంతో హైదరాబాద్ ఓఆర్ఆర్ ప్రాజెక్టుకు జనవరి 3, 2006న నగర పరిసరాల్లో శంషాబాద్ సమీపంలో ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ ప్రాజెక్టు 158 కిలోమీటర్ల పొడవు ఉంది. ఈ భారీ లింకింగ్ ప్రాజెక్టు నగరంలోని ప్రధాన ప్రాంతాలైన హైటెక్ సిటీ, నానక్ రామ్ గూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్, ఐకెపి నాలెడ్జ్ పార్క్ లను అనుసంధానం చేస్తుంది.

ఆర్బిటల్ షేపులో ఉన్నఓఆర్ఆర్ ప్రాజెక్టు పూర్తి అయిన తరువాత నుంచి హైదరాబాద్ నగరంలోని ఆయా ప్రాంతాలలో ప్రజలకు ట్రాఫిక్ సమస్య నుంచి విముక్తి లభించింది. తద్వారా సమీప పట్టణ ప్రాంతాలు హైదరాబాద్ లో భాగమవుతూ వచ్చాయి.

Also Read: మంచి మిత్రుడు, దార్శనికుడు, దేశానికెంతో చేశారు.. మన్మోహన్ సింగ్‌ని స్మరించుకున్న సోనియా గాంధీ

ఈ ప్రాజెక్టు కోసం జపాన్ కంపెనీ జెఐసిఏ 80 బిలియన్ యెన్లు (జపాన్ కరెన్సీ) .. దాదాపు రూ. 3123 కోట్ల లోన్ ఇచ్చింది. ప్రాజెక్టు మొత్తం ఖర్చు రూ. 6796 కోట్లు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెఎండిఏ) కు చెందిన ఒక రిటైర్డ్ అధికారి కథనం ప్రకారం.. ఆ రోజుల్లో విదేశాల నుంచి నిధులు తీసురావడం చాలా కష్టం. కానీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఓఆర్ఆర్ ప్రాజెక్టు ఆర్థిక ఇబ్బందుల గురించి తెలుసుకొని జపాన్ కంపెనీ నుంచి లోన్ సమకూర్చడానికి కేంద్రం నుంచి హామీ ఇప్పించారు. ఆయన 2008లో జపాన్ రాజధాని టోక్యో పర్యటనకు వెళ్లినప్పుడు జపాన్ లోని జెఐసిఏ కంపెనీతో ఓఆర్ఆర్ నిర్మాణం కోసం ఒప్పందం చేశారు. మన్మోహన్ సింగ్ గారు ఆ సమయంలో ప్రధాన మంత్రి పదవిలో ఉండడం వల్లనే హైదరాబాద్ ఓఆర్ఆర్ ఈ రోజు పూర్తయింది. దాని ఫలాలు హైదరాబాద్ వాసులకు అందాయి.

హైదరాబాద్ ఓఆర్ఆర్ ప్రాజెక్టుని రోడ్ కం డెవలప్మెంట్ ప్రాజెక్ట్ గా డిజైన్ చేశారు. ఓఆర్ఆర్ పూర్తి కావడంతో రెసిడెన్షియల్, కమర్షియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నగరంలో ఎంతో అభివృద్ధి చెందింది. ఆధునిక ఆస్పత్రులు, షాపింగ్ మాల్స్, సినిమా ఎంటర్‌టైన్మెంట్ కేంద్రాలు రూపు దాల్చాయి. చుట్టు పక్కల గ్రామాలు సైతం ఓఆర్ఆర్ వల్ల ఎంతో అభివృద్ధి చెందాయి.

డాక్టర్ మన్మోహన్ సింగ్ డిసెంబర్ 26 గురువారం రాత్రి మృతి చెందారు. ఆయన మరణంతో దేశ రాజకీయాల్లో ఓ శూన్యత ఏర్పడింది.

Related News

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

Big Stories

×