E-Paper
Advertisement

Mansukh Mandaviya: ఒక్కొక్కరికి అకౌంట్లలో రూ.15వేలు జమ.. కేంద్ర మంత్రి వెల్లడి

Mansukh Mandaviya: ఒక్కొక్కరికి అకౌంట్లలో రూ.15వేలు జమ.. కేంద్ర మంత్రి వెల్లడి
Advertisement

Union Minister reviews performance of Telangana Zone of EPFO, ESIC: ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్తగా ఉద్యోగాల్లో చేరే వారికి ఈఎల్ఐ కింద ఈపీఎఫ్ అకౌంట్లలో నెల జీతం కింద గరిష్టంగా రూ. 15వేల వరకు జమ చేయనుంది. ఈ విషయాన్ని కేంద్ర కార్మికశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు.

ఇక, దేశ వ్యాప్తంగా అధిక మిగులు నిధులు ఉన్న జోన్‌గా తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. ఇందులో ప్రధానంగా ప్రతి ఏడాది చందా మొత్తం పెరుగుతూ వస్తుండడం గమనార్హం. ఈ ఏడాది సుమారు 669 మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందగా.. వీరందరికీ అదే రోజున పింఛన్‌కు సంబంధించిన పీపీఓ జారీ అయింది.

Advertisement

అయితే, ఈఎల్ఐ పథకానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించామని కేంద్ర మంత్రి తెలిపారు. ఇందులో భాగంగానే ఈపీఎఫ్ఓ హైదరాబాద్ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఈఎల్ఐ నిధుల అమలు కోసం ఓ ఐటీ వ్యవస్థను తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.

ఇక, తెలంగాణలో 36,018 సంస్థల కింద దాదాపు 47.96 లక్షలమంది చందాదారులు, 4.54 లక్షలమంది పెన్షన్ తీసుకునేవారు ఉన్నట్లు కేంద్ర మంత్రి వివరించారు. కాగా, హైదరాబాద్‌లోని బర్కత్ పుర పీఎఫ్ కార్యాలయాన్ఈని సందర్శించిన ఆయన ఒక్కో ఉద్యోగికి గరిష్టంగా రూ.15వేలు జమ కానున్నట్లు తెలిపారు. తెలంగాణ జోన్ పనితీరు చాలా బాగుందని కితాబిచ్చారు.

Advertisement

ఈ సందర్భంగా ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ, ఉద్యోగుల రాష్ట్ర బీమా సంస్థ, డిప్యూటీ చీఫ్ లేబర్‌ల తెలంగాణ జోన్ పనితీరుపై కేంద్ర మంద్రి మన్‌సుఖ్ మాండవ్య సమీక్ష నిర్వహించారు. ఈపీఎఫ్ తెలంగాణ జోన్‌ల ప్రతి ఏడాది రూ.7,797కోట్ల చెల్లింపులు జరుగుతున్నట్లు వెల్లడించారు.

అందుకే కొత్తగా చేరుతున్న ఉద్యోగుల కోసం కేంద్రం ఈ ఏడాది బడ్జెట్‌లో ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇన్సెంటివ్(ఈఎల్ఐ) స్కీమ్‌ను ప్రకటించిందని గుర్తు చేశారు. ఈ స్కీమ్ కింద తొలిసారి ఉద్యోగంలో చేరుతున్న యువతీయువకులకు ఒక నెల జీతం ప్రభుత్వం సబ్సిడీ రూపంలో అందిస్తుందని తెలిపారు.

Also Read: హైదరాబాద్‌లో భారీగా వర్షం… అటువైపు వెళ్తే మీ పని అయిపోయినట్టే!

ఈ జోన్ పరిధిలో రూ.19,939కోట్ల చందా వసూళ్లు ఉండగా.. రూ.7,797 కోట్లు చెల్లింపులు ఉన్నాయి. ప్రతి ఏటా చందా వసూళ్లు పెరుగుతూనే ఉన్నాయి. అంతకుముందు 2023-24 ఆర్థిక సంవత్సరంలో 16.58శాతం పెరుగుదల నమోదు కాగా, పరిపాలన ఖాతాలో 14.90శాతం పెరిగడం ఆరోగ్యకరమైన ఆర్థిక స్థితిని సూచిస్తుందని వెల్లడించారు.

ఇక, ఈ ఏడాది 2024-25 ఆర్థిక సంవత్సర విషయానికొస్తే..కేవలం 10 రోజుల్లో సెటిల్ అయిన క్లెయిమ్‌లు 70.39 శాతం ఉండగా.. 20 రోజుల్లో 92.89శాతం ఉన్నాయని వెల్లడించారు.

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×