E-Paper
Advertisement

Hyderabad Police: ఆలయంలో మాంసం ముద్దలు.. అసలు విషయం చెప్పేసిన పోలీసులు..

Hyderabad Police: ఆలయంలో మాంసం ముద్దలు.. అసలు విషయం చెప్పేసిన పోలీసులు..
Advertisement

Hyderabad Police: హైదరాబాద్ లోని ఓ ఆలయంలో మాంసం ముద్దలు బయట పడిన విషయం తెల్సిందే. ఏకంగా ఆలయం లోపల మాంసం ముద్దలు ఉండడంతో అపచారం జరిగిందని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టకేలకు ఈ ఘటనకు కారకులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. చివరకు అసలు ఆలయంలోకి మాంసం ముద్దలు ఎలా వచ్చాయో తేల్చేశారు.

హైదరాబాద్ నగరంలోని ఓ ఆలయంలోకి బుధవారం వెళ్లిన అర్చకులకు ఆలయం లోపల మాంసం ముద్దలు కనిపించాయి. దీనితో ఈ విషయం తెలుసుకున్న భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. నిరంతరం భక్తులు వచ్చే ఆలయం, మాంసం ముద్దలు ఉండడంతో అపవిత్రమైందని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తెలుసుకున్న వెంటనే పలు హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సైతం స్పందించారు. వెంటనే ఘటనకు కారకులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు.

Advertisement

సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని, భక్తుల ద్వార వివరాలు ఆరా తీశారు. హైదరాబాద్ నగరంలో ఈ ఘటన సంచలనంగా మారింది. శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడ అలర్ట్ అయ్యారు. ఆలయ పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. భక్తులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, భాద్యులను శిక్షిస్తామని భక్తులకు పోలీసులు హామీ ఇచ్చారు. అయితే చివరకు పోలీసులు అసలు విషయాన్ని తేల్చి చెప్పారు.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆలయంలో మాంసం ముద్దలు ఉన్నట్లు తెలుసుకున్న వెంటనే సిసి కెమెరాలను పోలీసులు పరిశీలించారు. ఉదయం నుండి 17 సీసీ కెమెరా దృశ్యాలను పోలీసులు పరిశీలించారు. ఈ ఘటనకు ఓ పిల్లి కారణంగా పోలీసులు పేర్కొన్నారు. ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో పిల్లి తన నోటితో మాంసం ముద్దను పట్టుకొని ఆలయంలోకి వెళ్లినట్లు పోలీసులు ధ్రువీకరించారు. పిల్లి అలా వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డైనట్లు, పిల్లి వెళ్లే రీతిలో గేటు గ్రిల్స్ ఉన్నాయని పోలీసులు తెలిపారు.

Advertisement

Also Read: తిరుమల శ్రీవారి భక్తులకు.. టీటీడీ హెచ్చరిక.. ఇకపై అలా చేయవద్దంటూ హితవు

ఈ ఘటనకు పిల్లిదే భాద్యతగా పేర్కొన్న పోలీసులు, ఎటువంటి వదంతులు నమ్మవద్దని భక్తులను కోరారు. ప్రస్తుతం ఆలయంలో సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టే అసలు విషయం తెలిసిందని, ఆలయాలలో, ప్రార్థన మందిరాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు. మొత్తం మీద ఆలయంలో మాంసం ముద్ద ఉదంతానికి పోలీసులు 17 సీసీ కెమెరా దృశ్యాలు పరిశీలించి అసలు విషయాన్ని బయటకు చెప్పేశారు.

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×