E-Paper
Advertisement

Road Accident: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి.. సీఎం తీవ్ర దిగ్భ్రాంతి

Road Accident: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి.. సీఎం తీవ్ర దిగ్భ్రాంతి
Advertisement

Medak Road Accident Sevem killed: మెదక్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శివ్వంపేట మండలం ఉసిరికపల్లి వద్ద ఓ కారు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మృతి చెందిన వారిలో నలుగురు మహిళలతోపాటు మరో ఇద్దరు బాలికలు ఉన్నారు. మృతులంతా పాముబండ తండాకు చెందిన వాారిగా గుర్తించారు.

రహదారిపై గుంతలు ఎక్కువగా ఉండడంతో వేగంగాా వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పడంతోపాటు పక్కన ఉన్న ఓ కల్వర్టును ఢీకొట్టింది. దీంతో కారు గాల్లోకి ఎగిరి పల్టీలు కొట్టి పక్కనే ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది. దీంతో ఏడుగురు నీటిలో మునిగి మృతి చెందారు. డ్రైవర్ తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన వీరంతా తూప్రాన్ దగ్గర ముత్యాలమ్మ గ్రామ దేవత ఆలయానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు.

Advertisement

మెదక్ రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Also Read: ఎయిర్‌లైన్స్‌కు బాంబు బెదిరింపులు.. పోలీసుల అదుపులో మైనర్.. పోస్టుల వెనక రహస్యమిదే!

Advertisement

ఇదిలా ఉండగా, ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ప్రమాదం జరిగిందని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించారు. మద్యం మత్తులో ప్రమాదం జరిగిందా లేదనే వివరాలు విచారణలో తెలుస్తాయని వెల్లడించారు.

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×