E-Paper
Advertisement

Medaram Jatara: నేటితో ముగియనున్న మేడారం మహాజాతర.. తిరుగు ప్రయాణాలతో భారీగా ట్రాఫిక్ జామ్

Medaram Jatara: నేటితో ముగియనున్న మేడారం మహాజాతర.. తిరుగు ప్రయాణాలతో భారీగా ట్రాఫిక్ జామ్
Advertisement

Medaram Jatara: తెలంగాణ కుంభమేళా మేడారం మహా జాతర నేటితో ముగియనుంది. వన దేవతలు సమ్మక్క-సారలమ్మ గద్దెలపైకి చేరుకోవడంతో.. మేడారం జన సంద్రంలా మారింది. జంపన్న వాగులో లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు చేసి గద్దెలపై కొలువు దీరిన అమ్మవార్లకు బంగారం(బెల్లం)తో మొక్కులు తీర్చుకుంటున్నారు. నిన్న ఒక్కరోజే సుమారు 50 లక్షల మందికి పైగా భక్తులు వన దేవతలను దర్శించుకున్నారు. గత మూడు రోజులుగా 80 లక్షలకు పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. సమ్మక్క-సారలమ్మలతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై కొలువుదీరడంతో భక్తులు భారీగా తరలివచ్చారు.

భారీగా ట్రాఫిక్ జామ్

భక్తులు భారీగా తరలిరావడంతో.. తాడ్వాయి- మేడారం మార్గంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తాడ్వాయి నుంచి మేడారం వెళ్లే రహదారిలో దాదాపు 8 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. గత మూడు రోజులుగా జాతరలో పాల్గొని మొక్కులు తీర్చుకున్న భక్తులు తిరుగు ప్రయాణం అవుతున్నారు. శుక్రవారం పస్రా నుంచి తాడ్వాయి, మేడారం వరకు భారీగా ట్రాఫిక్‌ జామ్ అయింది. వేల సంఖ్యలో వాహనాలు రెండున్నర గంటల పాటు రోడ్లపై చిక్కుకుపోయాయి. ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు ఏర్పాట్లు చేసినప్పటికీ.. ఇబ్బందులు సమస్య తప్పలేదు.

80 లక్షలకు పైగా భక్తులు

Advertisement

మేడారం మహాజాతర శనివారం సమ్మక్క వన ప్రవేశం ఘట్టంతో ముగుస్తుంది. ఇవాళ సాయంత్రం 4 గంటల తర్వాత ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. బుధవారం సారలమ్మ ఆగమనంతో ప్రారంభమైన జాతరకు గత మూడు రోజుల్లో 80 లక్షల మంది భక్తులు వచ్చి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. చివరి రోజు కావడంతో భక్తుల రాక పెద్ద సంఖ్యలో ఉంటుందని అంటున్నారు.

Also Read: మేడారం ఓ అద్భుతం.. వనదేవతలను దర్శించుకోండి.. జాతరలో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ సందడి

నేటితో ముగియనున్న జాతర

Advertisement

మేడారం మహాజాతర జనవరి 28న ప్రారంభమై జనవరి 31తో ముగియనుంది. బుధవారం కన్నెపల్లి నుంచి సారలమ్మ, మహబూబాబాద్‌ జిల్లా పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, ములుగు కొండాయి నుంచి గోవిందరాజు గద్దెలపైకి చేరుకున్నారు. 29న చిలుకల గుట్ట నుంచి సమ్మక్కను ప్రధాన గద్దెపై ప్రతిష్ఠించారు. శుక్రవారం నాడు నలుగురు భక్తులకు దర్శనమిచ్చారు. ఇవాళ నలుగురు తిరిగి వన ప్రవేశం చేయడంతో మేడారం మహా జాతర ముగుస్తుంది. భక్తులు తిరుగు ప్రయాణం పట్టడంతో.. భారీగా రద్దీ నెలకొంది. భక్తుల రద్దీతో ఆర్టీసీ మరిన్నీ బస్సులను మేడారం జాతరకు నడుపుతుంది.

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×