Paidakula Ashok: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించిన మేడారం జాతర దేశంలోని నాలుగు మూలల ఆదివాసీల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ (Paidakula Ashok) పేర్కొన్నారు. మేడారం జాతరను విజయవంతం చేసిన మంత్రి సీతక్కకు (Minister Seethakka) ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దేశం నలుమూలల మేడారం జాతర గురించి, సమ్మక్క సారలమ్మ పోరాట గాథను తెలియజేసేలా మేడారం గుడిని నిర్మించడంలో సీతక్క విజయవంతం అయ్యారని తెలిపారు.
ఒంటిచేత్తో ఆసియా ఖండంలోని అతి పెద్ద గిరిజన జాతరను సీతక్క విజయవంతం చేశారని పేర్కొన్నారు. ప్రతి పక్ష నాయకులు కుట్రలు చేసిన, విమర్శలు చేసిన చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో మేడారం జాతరను విజయవంతం చేయడం సీతక్క కే సాధ్యం అయ్యిందన్నారు. తెలంగాణ ఉక్కు మహిళా సీతక్క మేడారం అభివృద్ధి కోసం గట్టిగా నిలబడి మేడారం జాతర ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేశారని చెప్పారు.
అతి తక్కువ సమయంలో మేడారం గుడి నిర్మాణ పనులను చేపట్టి, అనుకున్న సమయానికి అందజేసేలా చర్యలు తీసుకుని మేడారం జాతరను ఘన విజయం చేయడంలో సీతక్క గారి పాత్ర అత్యంత కీలకమన్నారు. జనవరి 28 నుండి 31 వరకు సాగిన మేడారం జాతరను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన మంత్రి సీతక్క గారికి, క్షణం తీరిక లేకుండా దగ్గరుండి పని చేపించిన ములుగు జిల్లా కలెక్టర్ టి.ఎస్. దివాకర కి, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ కు, అధికార యంత్రాంగానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దేవుళ్ళ మీద కూడా రాజకీయం చేయాలని చూసిన ప్రతిపక్ష నాయకులు ఆగడాలకు అడ్డుకట్ట వేస్తూ మేడారం జాతరను నడిపిన సీతక్క తీరు అమోఘమన్నారు.
Also Read: DCC Prisidents: తెలంగాణ కాంగ్రెస్ జిల్లాల అధ్యక్షుల నియామకం.. 36 మందితో కూడిన జాబితా విడుదల