Open Manhole: స్వేచ్ఛ బ్యూరో: మేడ్చల్ డివిజన్ పరిధిలో జీహెచ్ఎంసీ కార్యాలయం వెళ్లే దారిలో హౌసింగ్ బోర్డ్ కాలనీ లో తెరిచి ఉన్న మ్యాన్ హోల్ తో ప్రజలు వాహనదారులు పడుతున్న ఇబ్బందులను, అధికారులు పట్టించుకోని విషయాన్ని స్వేచ్ఛ ప్రత్యేక కథనాన్ని ప్రచురించడంతో అధికారులు స్పందించారు. మంగళవారం మధ్యాహ్నం వరకు తెరిచి ఉన్న మ్యాన్ హోల్ ను మూసివేశారు. ఇంతకాలం పట్టించుకోని జీహెచ్ఎంసీ అధికారులు స్వేచ్ఛ కథనంతో స్పందించడంతో స్థానికులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Also read: పక్కన పడేస్తారు? లేక పైసలిస్తారా?.. విద్యుత్ శాఖలో ఏఐ ప్రయోగానికి గండం..!
మేడ్చల్ జీహెచ్ఎంసీ సర్కిల్లో ప్రజా సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నా అధికార యంత్రాంగం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నా, రోడ్లు ధ్వంసమవుతున్నా పట్టించుకోని అధికారులు ఇప్పుడు రోడ్డుమధ్య నోరు తెరిచి ఉన్న మ్యాన్హోల్పైనా కళ్లు మూసుకున్నారు. మేడ్చల్ డివిజన్లో అత్యంత రద్దీగా ఉండే హౌజింగ్ బోర్డు కాలనీ రోడ్డులో ఈ ప్రమాదకర మ్యాన్హోల్ చాలా రోజులుగా తెరిచే ఉంది.
Also Read: మండుటెండలో చల్లని ప్రయాణం.. క్రేజీ KYT R1R హెల్మెట్ లాంచ్!