Ganja Smuggling: స్వేచ్చ బ్యూరో: ఒడిశా నుంచి గంజాయిని తెప్పించి అక్రమంగా విక్రయిస్తున్న ఓ యువకుడిని మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మేడ్చల్ సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. ఒడిశాకు చెందిన అలోక్ సర్కార్ (20) ప్రస్తుతం కిస్తాపూర్ నివాసం ఉంటూ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు.
తన స్నేహితుడు సోహైల్ (22) సహకారంతో ఒడిశా నుంచి 2 కిలోల ఎండు గంజాయిని విక్రయాల కోసం తెప్పించినట్లు విచారణలో వెల్లడైంది. విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించిన పోలీసులు అలోక్ సర్కార్ను అదుపులోకి తీసుకుని అతడి వద్ద నుంచి సుమారు రూ.లక్ష రూపాయలు విలువైన 2 కిలోల ఎండు గంజాయితో పాటు ఒక మొబైల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Also Read: గులాబీ రంగులో మెరిసే సరస్సులు.. ఈ అందం వెనుక ఇంత కథ ఉందా?
ఈ కేసులో ప్రధాన సహచరుడు సోహైల్ ప్రస్తుతం పరారీలో ఉండగా, పోలీసులు అతడి కోసం విసృతంగా గాలింపు చర్యలు చేపట్టామని పోలీసు అధికారులు తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు మేడ్చల్ సీఐ సత్యనారాయణ వెల్లడించారు.
Also read: Jagan In Visakha: బోటు ప్రమాదంపై చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం.. ఎందుకు స్పందించలేదని జగన్ ప్రశ్న