E-Paper
Advertisement

బిగ్ అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి మీ సేవలు బంద్!

బిగ్ అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి మీ సేవలు బంద్!

Mee Seva: స్వేచ్ఛ బ్యూరో: రెండు రోజుల పాటు ‘మీసేవ’ సేవలు బంద్ కానున్నాయి. మెయింటెనెన్స్, డేటాబేస్ మైగ్రేషన్ పనుల కారణంగా రెండు రోజుల పాటు మీసేవ సేవలు అందుబాటులో ఉండవని మీసేవ అధికారులు వెల్లడించారు. మీడియా ప్రకటన విడుదల చేశారు. ఈనెల 3వ తేదీ రాత్రి 10 గంటల నుంచి ఈ నెల 5 తేదీ ఉదయం 8 గంటలవరకు సేవలు నిలిచిపోనున్నాయన్నారు.

మీసేవ కేంద్రాల్లో..

మీసేవ పోర్టల్ పనితీరును మరింత మెరుగుపరచడానికి, సర్వర్ల సామర్థ్యాన్ని పెంచడానికి డేటాబేస్ మైగ్రేషన్ ప్రక్రియను చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ పనుల వల్ల ఆ కాలంలో ఆన్‌లైన్ సేవలతో పాటు మీసేవ కేంద్రాల్లో జరిగే లావాదేవీలన్నీ నిలిచిపోతాయన్నారు. ఈనెల 5వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటల తర్వాత నుంచి సేవలు ఎప్పటిలాగే పునరుద్ధరించబడతాయని అధికారులు స్పష్టం చేశారు. అత్యవసర పనులు ఉన్నవారు ఈ గడువును దృష్టిలో ఉంచుకొని ముందే ప్లాన్ చేసుకోవాలని సూచించారు.

Also Read: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. కొత్తగా 2 లక్షల పెన్షన్లు! గ్రామసభల ద్వారా

మీసేవ చార్జీలు 50శాతం పెంపు

రాష్ట్ర ప్రభుత్వం మీసేవ సేవల వినియోగదారుల ఛార్జీలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మీసేవ కేంద్రాల ద్వారా అందజేసే అన్ని రకాల సేవలపై వినియోగదారుల ఛార్జీలను ప్రభుత్వం 50% మేర పెంచింది. ఈ పెంచిన ఛార్జీలకు అదనంగా 18% జీఎస్టీ కూడా వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కేటగిరీ-A సేవల ధర రూ. 35 నుండి రూ. 62 కి, కేటగిరీ-B సేవల ధర రూ. 45 నుండి రూ. 80 కి పెరిగింది. ఇందులో మొదటి 4 పేజీల తర్వాత స్కానింగ్ లేదా ప్రింటింగ్‌కు ప్రతి పేజీకి రూ. 2.50 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇతర బిల్లు చెల్లింపుల ఛార్జీలు కూడా రూ. 35 నుండి రూ. 53 మధ్య నిర్ణయించబడ్డాయి.

విద్యుత్ బిల్లుల చెల్లింపు ఛార్జీలు..

టీజీఎన్పీడీసీఎల్, టీజీఎస్పీడీసీఎల్ విద్యుత్ బిల్లుల చెల్లింపులపై కూడా కొత్త ఛార్జీలు వర్తిస్తాయి. రూ.200లోపు బిల్లులకు రూ.4, రూ. 201 నుండి రూ.1000 వరకు రూ.9, రూ.1001 నుండి రూ.2500 వరకు రూ.18, రూ.2500పైబడిన బిల్లులకు రూ.44 యూజర్ ఛార్జీగా నిర్ణయించారు. పెంచిన ఛార్జీల ద్వారా వచ్చే ఆదాయంలో ఎక్కువ భాగం మీసేవ కేంద్రాల నిర్వాహకులకు ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం నిర్ణయించింది. ఇన్ఫ్రా, డిపార్ట్‌మెంట్, ఎస్సీఏ వాటాల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ఈ కొత్త నిబంధనలు తక్షణమే అమలులోకి వస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది.

Also Read: మీ ఆధార్‌తో వేరే వాళ్లు సిమ్ వాడుతున్నారా.. అయితే బీ కేర్‌ఫుల్..!

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×