E-Paper
Advertisement

Madhya Pradesh: ఘోర విషాదం..ప్రమాదకర వాయివు పీల్చి నలుగురు మృతి

Madhya Pradesh: ఘోర విషాదం..ప్రమాదకర వాయివు పీల్చి నలుగురు మృతి
Advertisement

Four die after inhaling suspected poisonous gas in Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ప్రమాదకర వాయువు పీల్చి నలుగురు మృతి చెందారు. కట్నీలో ఓ బావిలో మరమ్మతులు చేసేందుకు దిగిన ఓ వ్యక్తితోపాటు నలుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

జుహ్లా-జుహ్లా గ్రామంలో రామ్ భయ్యా దూబే(36) నీటి పంపు అమర్చేందుకు బావిలోకి దిగాడు. అయితే కాసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీంతో అతనిని కాపాడేందుకు అతని మేనల్లుడు నీటిలోకి ప్రవేశించాడు. అతను కూడా పైకి రాకపోవడంతో మరో ముగ్గురు నీటిలోకి దిగారు.

Advertisement

రాజేస్ కుస్వాహా(30), ఓ కూలీ, పింటూ కుష్వాహాలు నీటిలోకి దిగారు. అందరూ ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

కలెక్టర్ దిలీప్ యాదవ్ తోపాటు పోలీస్ సూపరింటెండెంట్ అభిజీత్ రంజన్ సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. నలుగురు మృతదేహాలను బయటకు తీసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం గ్రామస్తులను అప్రమత్తం చేశారు.

Related News

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

Big Stories

Advertisement
×