E-Paper
Advertisement

TG Assembly Updates : గత ప్రభుత్వంలో అప్పులేనా ? ఆస్తుల గురించి చెప్పరా? : కేటీఆర్

TG Assembly Updates : గత ప్రభుత్వంలో అప్పులేనా ? ఆస్తుల గురించి చెప్పరా? : కేటీఆర్
Advertisement

KTR vs Minister Bhatti Vikramarka : ఏడవరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టగా.. కేటీఆర్ దానిపై చర్చ ప్రారంభించారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా ఉందని ఆర్బీఐ చెబుతోందని, దేశంలో తెలంగాణ జీడీపీ వృద్ధి చెందిందని తెలిపారు. కానీ ఎన్నికలు పూర్తయ్యాక కూడా కాంగ్రెస్ గత ప్రభుత్వ పాలనపై బురద చల్లడం సబబు కాదన్నారు. గత ప్రభుత్వంలో అప్పులే ఉన్నాయని చెప్పడం సరికాదన్న ఆయన.. ఆస్తుల గురించి ఎప్పుడూ చెప్పరెందుకని అసెంబ్లీలో ప్రశ్నించారు.

కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ లో అప్పగించామని కేటీఆర్ తెలిపారు. మిగులు బడ్జెట్ లో ఇచ్చిన రాష్ట్రంపై కూడా.. ఇప్పటి ప్రభుత్వం చెబుతున్న లెక్కలు తప్పుగా ఉన్నాయని ఆరోపించారు. ఉద్యమాలతో వచ్చిన తెలంగాణ.. ఉజ్వలంగా వెలుగుతోందన్నారు. కరోనా కారణంగా రాష్ట్రంలో ఆర్థికవ్యవస్థ కాస్త అస్తవ్యస్తమయిందన్నారు.

Advertisement

Also Read : బీఆర్ఎస్ డైవర్ట్ పాలిటిక్స్, కేసీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి ఆసక్తి వ్యాఖ్యలు..

మాట్లాడితే గత ప్రభుత్వం అప్పులు చేసిందంటూ.. ప్రచారం చేయడం తగదన్నారు. మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరుగ్యారెంటీలపై బడ్జెట్ లో ప్రస్తావనే లేదని దుయ్యబట్టారు. విపక్షంలో ఉండగా తెలంగాణ అభివృద్ధిని ప్రశంసించిన భట్టి.. ఇప్పుడు మరోలా మాట్లాడుతున్నారన్నారు. రైతుల రుణమాఫీ కోసం కాంగ్రెస్ సర్కార్ బాగా పనిచేస్తుందని అభినందించారు కేటీఆర్.

Advertisement

గత ప్రభుత్వం అప్పులు చేయకపోతే.. రెవెన్యూ లోటు లేకపోతే ఉద్యోగులకు ఒకటవ తేదీన జీతాలు ఎందుకు ఇవ్వలేదని మంత్రి భట్టి విక్రమార్క ప్రశ్నించారు.

ద్రవ్యవినిమయ బిల్లుపై విస్తృత చర్చ జరగాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలని ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై బడ్జెట్ లో ప్రస్తావనే లేదని విమర్శించారు. కాగా.. అసెంబ్లీలో అందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వాలని, సభా సమయాన్ని వృథా చేయవద్దని మంత్రి శ్రీధర్.. కేటీఆర్ ను ఉద్దేశించి అన్నారు.

 

 

 

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×