E-Paper
Advertisement

Bhatti Vikramarka : మీకు పొలముందా అయితే విద్యుత్ పండించండి.. అవ్వాకవుతున్నారా.. నిజం

Bhatti Vikramarka : మీకు పొలముందా అయితే విద్యుత్ పండించండి.. అవ్వాకవుతున్నారా.. నిజం
Advertisement

Bhatti Vikramarka :

⦿ రెండు మెగావాట్ల వరకు అనుమతులు
⦿ కొనుగోలు చేయనున్న ప్రభుత్వం

Advertisement

హైదరాబాద్, స్వేచ్ఛ: రాష్ట్రంలో ప్రధానమంత్రి కుసుమ్ కాంపోనెంట్ – ఏ పథకం ద్వారా రైతుల పొలాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఆదేశాలు జారీ చేసినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మంగళవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్తాన్ మహాభియాన్ (పీఎం – కుసుమ్) కార్యక్రమం ద్వారా రైతుల పొలాల్లో సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేసి వారికి అదనపు ఆదాయ మార్గాలను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.

ఈ పథకం కింద 0.5 మెగావాట్ల నుండి రెండు మెగావాట్ల వరకు సామర్థ్యం గల సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఎండిపోయిన లేదా పాడుబడిన వ్యవసాయ భూములపై ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఈ విధంగా కాలుష్య రహిత విద్యుత్ ఉత్పత్తిని చేయడంతో పాటు రైతులకు అదనపు ఆదాయాన్ని సమకూర్చే ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు. రైతులు తమ భూమిని సోలార్ విద్యుత్ ప్లాంట్ అభివృద్ధి కోసం డెవలపర్లకు లీజుకు ఇచ్చుకోవచ్చు. ఈ సందర్భంలో భూమి యజమానికి డెవలపర్లకు మధ్య డిస్కమ్‌ల ద్వారా ఒప్పందం మేరకు లీజు మొత్తం అందించబడుతుందని తెలిపారు.

Advertisement

Also Read : ఇందిరమ్మ ఇళ్లు వీరికే ముందు.. మున్నేరు బాధితులకు మంత్రి గుడ్ న్యూస్.. ఖమ్మానికి వరాల జల్లు

రైతులు, రైతు బృందాలు, సహకార సంఘాలు, పంచాయతీలు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజర్లు, వాటర్ యూజర్ అసోసియేషన్లు సైతం ఈ పథకం కింద దరఖాస్తు చేయవచ్చు అని స్పష్టం చేశారు. ఈ పథకం కోసం దరఖాస్తులు టీజీఆర్‌ఈడీసీవో ద్వారా ఆన్ లైన్‌లో సమర్పించాలని, లిస్టులో పేర్కొన్న సమీప సబ్ స్టేషన్‌ను ఎంపిక చేసుకొని అక్కడ సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. డిస్కం ఉత్పత్తి చేసిన సోలార్ విద్యుత్తును రూ.3.13/కిలో వాట్ గంట(కేడబ్ల్యూహెచ్) ధర వద్ద 25 సంవత్సరాల పాటు కొనుగోలు చేస్తుందని చెప్పారు భట్టి విక్రమార్క.

Related News

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Big Stories

Advertisement
×