Jupally Krishna Rao: స్వేచ్ఛ, బ్యూరో: రైతులకు న్యాయమైన ధర కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక, సాంస్కృతిక, అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) అన్నారు. కొల్లాపూర్ మండలం కొప్పునూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శనగ కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు పండించిన శనగ పంటను ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాల్కు రూ.5,875కు కొనుగోలు చేస్తామని తెలిపారు.
Also Read: EV Summer Tips: సమ్మర్ లో ఎలక్ట్రిక్ కారు వాడుతున్నారా? ఏసీ విషయం లో జాగ్రత్త!
కొనుగోలు ప్రక్రియలో నాణ్యత ప్రమాణాలు పాటించడం ముఖ్యమని, శనగలో తేమ శాతం 14 శాతం లోపే ఉండేలా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశించారు. రైతులకు మద్దతుగా ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది, మార్క్ఫెడ్ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Also Read: Ban On SRH: సన్ రైజర్స్ టికెట్ కొంటే, పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషించినట్లే !