Ban On SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament ) ప్రారంభం కంటే ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ( sunrisers hyderabad ) ఊహించని వివాదంలో చిక్కుకుంది. ది హండ్రెడ్ లీగ్ వేలం ( The Hundred Auction) సందర్భంగా పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను ( Abrar Ahmed) కావ్య మారన్ ( Kavya Maran) కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఒక కావ్య పాపను దేశద్రోహి అంటూ విమర్శలు చేస్తున్నారు.సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పైన బ్యాన్ ( ban on srh) విధించాలని కోరుతున్నారు. ఇక లేటెస్ట్ గా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సంబంధించిన మ్యాచ్ టికెట్లను ఎవరు కొనుగోలు చేయకూడదని తెలుగు క్రికెట్ అభిమానులు సరికొత్త నినాదాన్ని తెరపైకి తీసుకువచ్చారు. సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ చూసేందుకు టికెట్ కొంటే.. పాకిస్తాన్ ఉగ్రవాదులను ( pakistan terrorists ) పెంచి పోషించినట్లే అని షాకింగ్ పోస్టులు పెడుతున్నారు.
Also Read: Shubman Gill On Sanju: ఛీ..ఛీ ఇదేం బతుకురా, సంజుపై గిల్ కుట్రలు..ఫోటో మార్ఫింగ్ చేసి మరీ!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఈ మ్యాచ్ కు సంబంధించిన టికెట్లను కొనుగోలు చేస్తే, పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషించినట్లేనని తెలుగు క్రికెట్ అభిమానులు దారుణంగా పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను కావ్య పాప కొనుగోలు చేసిన నేపథ్యంలో ఈ పోస్టులు పెడుతున్నారు తెలుగు క్రికెట్ అభిమానులు. మొన్నటి వరకు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టును ఎంతో అభిమానంగా చూసామని అంటున్నారు. కానీ ఇప్పుడు ఇండియాను శత్రువులా భావించే పాకిస్తాన్ క్రికెటర్లను ఎందుకు కొనుగోలు చేశావు ? అంటూ కావ్య పాపపై బండ బూతులు తిడుతూ పోస్టులు కూడా పెడుతున్నారు.
కావ్య పాపకు బాగా బలుపు ఉందని.. ఆ డబ్బులు చూసుకొని ఇంకెన్ని రోజులు మురుస్తావు ? అంటూ తమకు నచ్చిన భాషలో తిడుతూ రెచ్చిపోతున్నారు తెలుగు అభిమానులు. అంతేకాదు ఐపీఎల్ 2026 టోర్నమెంట్ సందర్భంగా సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఎవరూ చూడకూడదని కోరుతున్నారు. ఆ టికెట్లను కొనుగోలు చేయకూడదని.. ఒకవేళ ఆ టికెట్లు కొంటే పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషించినట్లే అవుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కొత్త చిక్కులు వచ్చాయి.
పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను కావ్య పాప కొనుగోలు చేయడంపై బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. ఇందులో ఎలాంటి తప్పిదం లేదని చెప్పకనే చెప్పింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఐపీఎల్ టోర్నమెంటులో పాకిస్తాన్ క్రికెటర్లను కొనుగోలు చేయకుండా కఠినమైన రూల్స్ అమలు చేస్తున్నామని పేర్కొంది. కానీ ది హండ్రెడ్ లీగ్ తమ పరిధిలోకి రాదని.. కావ్య పాప ఎవరినైనా కొనుగోలు చేసుకోవచ్చని కుండ బద్దలు కొట్టింది భారత క్రికెట్ నియంత్రణ మండలి.
https://www.facebook.com/photo/?fbid=1460038898801958&set=pcb.1460038988801949
https://www.facebook.com/photo/?fbid=1460038898801958&set=pcb.1460038988801949