E-Paper
Advertisement

Minister komatireddy: మాట తప్పేది లేదు.. మే నాటికి ఇస్తామన్న మంత్రి కోమటి రెడ్డి

Minister komatireddy: మాట తప్పేది లేదు.. మే నాటికి ఇస్తామన్న మంత్రి కోమటి రెడ్డి
Advertisement

Minister komatireddy: రానున్న రెండేళ్లలో ఎస్‌ఎల్‌బీ‌సీ సొరంగం పూర్తి చేస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. నల్గొండను బంగారు కొండగా మారుస్తామన్నారు. ప్రతీ ఎకరాకు నీళ్లు ఇస్తామన్నారు. ప్రతీ ఇంటికి త్రాగు కచ్చితంగా ఇస్తామని మనసులోని మాట బయటపెట్టారు.

బ్రహ్మణ వెల్లంల ప్రాజెక్టు ద్వారా రాబోయే పది రోజుల్లో దాదాపు 40 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని, మే నాటికి లక్ష ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. 70 శాతం పూర్తయిన ఎస్.ఎల్.బీ.సీ సొరంగం పనులను, పదేళ్లు పాలించిన కేసీఆర్ సర్కార్ పక్కన పెట్టిందన్నారు.

Advertisement

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అమెరికాకు వెళ్లి బోరింగ్ స్పేర్ పార్ట్స్ తెప్పించడం జరుగుతుందన్నారు మంత్రి. నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలంగోపలాయిపల్లి శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. తిరు కళ్యాణంలో పాల్గొని స్వయంగా స్వామివారి పల్లకి మోశారాయన.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, ఆలయానికి కూతవేటు దూరంలో బ్రహ్మణ వెల్లంల ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందన్నారు. రాబోయే రోజుల్లో మరింత అద్భుతంగా ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఆనాడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్.ఎల్.బీ.సీ సొరంగాన్ని మంజూరీ చేయించామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో సొరంగం పనులు పూర్తి చేస్తామన్నారు.

Advertisement

ALSO READ:  ఆలయంలో అపచారం.. శివలింగం వద్ద మాంసం ముద్దలు!

పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి కృష్ణమ్మను వేణుగోపాలస్వామి చెంతకు చేరుస్తామని తెలియజేశారు. తెలంగాణపై వేణుగోపాల స్వామివారి ఆశీస్సులతో పాడి పంటలు, సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని వేడుకోవడం జరిగిందన్నారు. చెరువు గట్టు ఆలయం అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచామని, త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. అలాగే వేణుగోపాల స్వామి ఆలయాన్ని కూడా అభివృద్ధి చేస్తామన్నారు. చెరువుగట్టు జాతర తర్వాత ఈ ప్రాంతంలో రెండో పెద్ద జాతర వేణుగోపాలస్వామి వారి జాతర అని తెలిపారు.

Related News

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Big Stories

Advertisement
×