E-Paper
Advertisement

Ponguleti Serious on KCR: ధరణి పేరుతో పెద్దాయన మోసం చేశారు: మంత్రి పొంగులేటి

Ponguleti Serious on KCR: ధరణి పేరుతో పెద్దాయన మోసం చేశారు: మంత్రి పొంగులేటి
Advertisement

Ponguleti Serious Comments on KCR(Telangana politics): మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం అసెంబ్లీలో భూసంస్కరణలు, ధరణిపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూసంస్కరణలకు ఇందిరా గాంధీ శ్రీకారం చుట్టారంటూ ఆయన గుర్తు చేశారు. ప్రధానిగా ఉన్నప్పుడు పీవీ నరసింహారావు కూడా భూసంస్కరణలు చేశారని ఆయన అన్నారు. ప్రపంచ చరిత్రలో నిలిచిపోయిన భూదాన ఉద్యమం తెలంగాణలోనే పుట్టిందని మంత్రి పేర్కొన్నారు. 1973లో కాంగ్రెస్ ప్రభుత్వం సీలింగ్ చట్టం తెచ్చిందని, ఈ చట్టంతోనే పేదలకు భూములు పంచారని ఆయన చెప్పారు. వైఎస్ హయాంలో పోడు భూములకు పట్టాలు ఇచ్చారంటూ మంత్రి పొంగులేటి గుర్తు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి కేసీఆర్ పై మండిపడ్డారు. గతంలో తెలంగాణలో అధికారంలో ఉన్న చాలామంది కూడా భూసంస్కరణల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామన్నారని ఆయన అన్నారు. అయితే, రాష్ట్రంలో ఎక్కడ చూసినా భూ సమస్యలే ప్రధానంగా కనిపిస్తున్నాయన్నారు.

Advertisement

Also Read: రెనెన్యూ రాబడులు పెరిగాయి: కాగ్

‘గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ లోపభూయిష్టంగా ఉన్నది. ధరణి తెచ్చిన సమస్యల వల్ల పేద రైతులు ఇప్పటికీ అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ధరణి పేరుతో అప్పటి పెద్దాయన ప్రజలను మోసం చేశారు. ధరణి పోర్టల్ వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు’ అంటూ మంత్రి పొంగులేటి ఫైరయ్యారు.

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×