E-Paper
Advertisement

Hyderabad News: జూబ్లీహిల్స్ బైపోల్ పై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు, ఇంకా భ్రమల్లో ఆ పార్టీ

Hyderabad News: జూబ్లీహిల్స్ బైపోల్ పై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు, ఇంకా భ్రమల్లో ఆ పార్టీ
Advertisement

Hyderabad News: తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేడి మొదలైంది. వచ్చేవారం నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. నేతలు సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఓటర్లకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కంటోన్మెంట్‌లో జరిగిందే జూబ్లీహిల్స్ బైపోల్ లో జరుగుతుందన్నారు.

జూబ్లీహిల్స్ బైపోల్‌కు సమయం దగ్గరపడుతున్న వేళ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైనట్టు కనిపిస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో జరుగుతున్న పనులపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్‌పేట్ డివిజన్ ఓయూ కాలనీ‌లో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట్ స్వామిలు పర్యటించారు.

Advertisement

ఈ డివిజన్‌లో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి మంత్రులకు వివరించారు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్. వర్షాల కారణంగా చేస్తున్న పనులు, చేయాల్సిన పనులు గురించి మంత్రులు వివరించారు స్థానిక నేతలు. వీలైనంత వేగంగా పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు.

ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ ఛానెల్‌తో మాట్లాడారు. జూబ్లీహిల్స్ బైపోల్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కంటోన్మెంట్ ఉప‌ఎన్నికల్లో జరిగిందే జూబ్లీహిల్స్‌లో జరుగుతుందన్నారు. బీఆర్ఎస్ ఇంకా అపోహల్లో ఉందన్నారు. జూబ్లీహిల్స్‌లో గెలుపు మాదేనంటూ బీఆర్ఎస్ చెబుతున్న మాటలపై ఆయన రియాక్ట్ అయ్యారు.

Advertisement

ALSO READ: గిరిజన వర్సెస్ గిరిజనేతర గ్రామాల్లో ఎన్నికలపై సుప్రీంకోర్టు స్టే

గడిచిన పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయలేదని ప్రజలకు తెలుసుకున్నారని, అందుకు మార్పు కోరుతున్నారని అన్నారు. రేషన్ కార్డుల మొదలు సన్నబియ్యం వరకు తాము చేసి చూపించామన్నారు. నగరంలో సమస్యలను ఒకొక్కటిగా పరిష్కరిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్ నుంచి టికెట్ రేసులో చాలామంది ఉన్నారనే విషయంపైనా నోరు విప్పారు సదరు మంత్రి. టికెట్ ఎవరికి ఇవ్వాలనేది పార్టీ హైకమాండ్ దే ఫైనల్ నిర్ణయమన్నారు. అభ్యర్థి ఎంపికలో మాకు ఎలాంటి ప్రమేయం ఉండదన్నారు. క్షేత్రస్థాయిలో ముగ్గురు మంత్రులు, అధికారులతో కలిసి జిల్లా వ్యాప్తంగా పనులు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

బీసీ రిజర్వేషన్‌పై పిటిషన్ న్యాయస్థానంలో ఉందని, దాని గురించి మాట్లాడకపోవడమే మంచిదన్నారు. ప్రజల ఆశీర్వాదంతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. ఎన్నికలు వస్తున్నాయని తాము తిరగడం లేదని, జిల్లాకు ఇన్‌ఛార్జ్ మంత్రిగా అన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్న పనులను పరిశీలన చేస్తున్నామని అన్నారు. తాము నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నామన్నారు.

 

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×