Seethakka: కేసీఆర్ ఫిరాయింపుల పితామహుడు అంటూ మంత్రి సీతక్క విమర్శించారు. బుధవారం ఆమె గాంధీభవన్ లో మాట్లాడుతూ..బీఆర్ ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కొనుగోలు చేశారని ఆరోపించారు. ఫిరాయింపులకు పురుడు పోసిందే బీఆర్ ఎస్ ప్రభుత్వం అని చెప్పారు. కొత్తగా ఏర్పాడిన తెలంగాణలో ఫిరాయింపులను ప్రోత్సహించారన్నారు. ఇక గాంధీభవన్ లో జరిగిన ఎస్టీ సంఘాల మీటింట్ లో ఆమె మాట్లాడుతూ..ఎస్టీ సామాజిక వర్గ ప్రజలంతా ఏకం కావాల్సిన తరుణమిది అంటూ ఆమె వివరించారు.
ఆదివాసీ గిరిజన ఏజెన్సీ ఏరియా ల మీద కార్పొరేట్లు దాడి చేస్తున్నారని, అటవీ సంపదను మైనింగ్ పేరుతో మన కొండలను గుట్టలను కొల్లగొడుతున్నారన్నారు. వారిని మనమంతా ఐక్యంగా అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు మొదటినుంచి ఎస్సీ, ఎస్టీలకు అనగారిన వర్గాలకు అండగా నిలిచాయని, రాజ్యాంగంలో ప్రత్యేక రక్షణను కల్పించాయన్నారు ఫిఫ్త్ షెడ్యూల్, సిక్స్త్ షెడ్యూల్, పెస చట్టాలు తెచ్చి ఎస్టీలకు కాంగ్రెస్ రక్షణ కవచంగా నిలిచిందన్నారు. ఆదివాసి గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ శ్రీరామరక్ష అంటూ వెల్లడించారు. తొలి ప్రధాని నెహ్రూ మొదలుకొని, రాహుల్ గాంధీ వరకు ఎస్టీల అభివృద్ధి కోసం పనిచేస్తున్నారన్నారు. కానీ బీఆర్ ఎస్ బీజేపీ పాలనతో ఎస్టీ లకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే దేశం బాగుపడుతుందన్నారు.
Also Read: Team India: బికినీ భామతో టీమిండియా ప్లేయర్ ఎఫైర్.. ఈ లేడీ తప్ప ఇంకెవరు దొరకలేదరా