BigTV English

Thummala Nageswara Rao : అటవీ ప్రాంతంలోనే పుట్టాను.. ఆదివాసీల కష్టాలు తెలుసు..

Thummala Nageswara Rao : అటవీ ప్రాంతంలోనే పుట్టాను..  ఆదివాసీల కష్టాలు తెలుసు..

Thummala Nageswara Rao : ఖమ్మం జిల్లా బైపాస్ రోడ్‌లోని సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా కార్యాలయానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెళ్లారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ గెలుపునకు మద్దతు ఇచ్చిన ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, పార్టీ నేతలకు తుమ్మల ధన్యవాదాలు చెప్పారు. గిరిజనుల ఆత్మగౌరవ నిలబెట్టే విధంగా కాంగ్రెస్ పరిపాలన ఉంటుందని తుమ్మల పేర్కొన్నారు.


తుమ్మల మాట్లాడుతూ.. “నేను అటవీ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా ఆదివాసీల, గిరిజనుల కష్టాలు తెలుసు. అధికారం ఉన్నపుడు కొండ కోనల్లో ఉన్న అడవి బిడ్డల అభివృద్ధి కోసం పాటుపడ్డ. న్యూ డెమోక్రసీ బలంగా ఉన్న గుండాల, ఆళ్ళపల్లి మండలాల్లో మీ పార్టీ నేతలు నాకు సహకరించారు అది నేను ఎప్పుడు మర్చిపోనని” అన్నారు.

గత ప్రభుత్వంలో ప్రజాస్వామ్య హక్కులు కాలరాసి నపుడు సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా పార్టీ కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచిందని అన్నారు. ప్రశాంతమైన ప్రగతిశీల ఖమ్మం తన లక్ష్యమని తుమ్మల స్పష్టం చేశారు.


Related News

SC Stay On Elections: గిరిజన వర్సెస్ గిరిజనేతర.. ఆ 23 గ్రామాల్లో స్థానిక ఎన్నికలపై సుప్రీం స్టే

Rain: మళ్లీ అతిభారీ వర్షాలు వచ్చేస్తున్నయ్ భయ్యా.. కమ్ముకొస్తున్న పిడుగుల వాన, అలర్ట్‌గా ఉండండి..!

TGPSC Group-1: గ్రూపు-1 వివాదం కీలక మలుపు.. హైకోర్టులో మరో అప్పీలు

Medaram Maha Jatara: మేడారం మహాజాతర డిజిటల్ మాస్టర్ ప్లాన్ విడుదల

Sammakka-Saralamma: వనదేవతలు సమ్మక్క- సారలమ్మలు అన్ని గమనిస్తున్నారు.. కేంద్రంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy: సమ్మక్క-సారక్కలకు నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం రేవంత్

Heavy Rains: మరో అల్పపీడనం.. నాలుగు రోజులు వర్షాలు దంచుడే దంచుడు..

Hyderabad News: పండగ సమీపిస్తున్న వేళ.. జోరుగా నాన్ డ్యూటీ లిక్కర్, అధికారులు ఉక్కుపాదం

Big Stories

×