BigTV English
Advertisement

Rythu Bharosa Scheme: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. మీ ఖాతాలో నగదు జమ.. ఓ సారి చెక్ చేసుకోండి

Rythu Bharosa Scheme: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. మీ ఖాతాలో నగదు జమ.. ఓ సారి చెక్ చేసుకోండి

Rythu Bharosa Scheme: తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 26వ తేదీన ప్రారంభమైన రైతు భరోసా పథకాన్ని కొనసాగింపుగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. తెలంగాణ వ్యాప్తంగా రైతులకు ప్రభుత్వం అండదండగా నిలవాలని ఉద్దేశంతో రైతు భరోసా పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మొదటి దశలో పలువురు రైతులకు నగదు జమ కాగా, రెండవ దఫా రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.


సాగులో ఉన్న రైతులందరికీ ఆర్థిక భరోసా కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం రైతు పరస్పతకాన్ని ప్రవేశపెట్టింది. జనవరి 26 తేదీన ఈ పథకానికి శ్రీకారం చుట్టగా, ఏడాదికి అర్హులైన రైతులందరికీ రూ. 12 వేలు ప్రభుత్వం అందిస్తోంది. అయితే రెండు విడతలుగా నగదు జమ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించగా, ఇప్పటికే పలువురు రైతులకు రూ. 6 వేలు నగదు ఖాతాలో పడింది.

ప్రభుత్వం రైతన్నల పక్షాన నిలుస్తూ రైతు భరోసా పథకాన్ని ప్రవేశపెట్టగా.. ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్.. పేరుకే స్కీములు ప్రవేశపెడుతున్నారని విమర్శలు గుప్పించింది. దీనితో ప్రభుత్వం రైతులకు జమ వివరాలను కూడా ప్రజల ముందు ఉంచగా.. బీఆర్ఎస్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తాజాగా ఈ పథకానికి సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు.


Also Read: Minister Seethakka: ఇదే సరైన సమయం, ఆ పార్టీని నిలదీయండి-సీతక్క

బుధవారం రైతు భరోసా నిధుల జమ రెండవ దశ అమల్లోకి వచ్చిందని, ఒక ఎకరం వరకు సాగులో ఉన్న భూములకు మొత్తం రూ. 17.03 లక్షలు రైతుల ఖాతాల్లో జమవుతుందని ప్రకటించారు. రైతు భరోసా పథకానికి అర్హులను గుర్తించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలను నిర్వహించి ప్రభుత్వం జాబితాను కూడా ప్రజల ముందు ఉంచింది. ఆ అర్హుల జాబితాలో గల రైతులకు నేడు నగదు జమకానున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి మీ ఖాతాలో నగదు జమ అయిందా.. ఓసారి చెక్ చేసుకోండి.

Related News

Bandi Sanjay: కాంగ్రెస్ ప్లాన్ ఇదే.. జూబ్లీహిల్స్ ఈసీలో రైడ్స్ పై బండి సంజయ్ స్ట్రాంగ్ రియాక్షన్

Marri Janardhan Reddy: 2 డ్రాయర్లు, 2 బనియన్స్ నా ఇంట్లో దొరికినవి ఇవే.. మర్రి జనార్దన్ షాకింగ్ కామెంట్స్

BRS Leaders: ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం..

Telangana: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే.. అకౌంట్లోకి రూ.9,600

Jubilee Hills By Elections: ఇంకా రెండు రోజులే టైం.. జూబ్లీహిల్స్ ఎన్నికలపై టెన్షన్ టెన్షన్..

Defecting MLAs: కొనసాగుతున్న రెండవ రోజు ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ..

Maganti Family Issue: నా కొడుకు ఎలా చనిపోయాడో కేటీఆర్ చెప్పాలి? మాగంటి తల్లి బ్లాస్ట్..

Chamala Kiran Kumar Reddy: జర్మనీలో భారత పార్లమెంటరీ బృందం.. SPD నేతలతో ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి భేటీ

Big Stories

×