E-Paper
Advertisement

Uttam Kumar: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్.. తిరుగులేని విజయం సాధిస్తున్నాం, మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు

Uttam Kumar: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్.. తిరుగులేని విజయం సాధిస్తున్నాం, మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
Advertisement

రాష్ట్రంలోని మొత్తం కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో 90 శాతానికి పైగా స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని.. మున్సిపల్ ఓటర్లలో తిరుగులేని క్లారిటీ కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు.

గడిచిన ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తూ, కాంగ్రెస్ పార్టీ వరుస విజయాలతో దూసుకుపోతోందని ఉత్తమ్ గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలుకొని ఇటీవలి సర్పంచ్ ఎన్నికల వరకు ప్రజలు కాంగ్రెస్ వైపే నిలిచారని ఆయన అన్నారు. ముఖ్యంగా కంటోన్మెంట్ ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ ఎన్నికలు, జూబ్లీహిల్స్ వంటి కీలక ప్రాంతాల్లో పార్టీ సాధించిన విజయాలు కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయని తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ మద్దతుదారులే అత్యధిక స్థానాల్లో విజయం సాధించారని.. ఇదే ఊపు మున్సిపల్ ఎన్నికల్లోనూ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే పార్టీని గెలిపిస్తాయని ఉత్తమ్ పేర్కొన్నారు. ప్రతిపక్షాల విమర్శలను ప్రజలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని, గత పదేళ్ల పాలనలో జరిగిన వైఫల్యాలను ప్రజలు ఇంకా మర్చిపోలేదని ఆయన విమర్శించారు. పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, పాలనలో పారదర్శకతకు కాంగ్రెస్ పెద్దపీట వేస్తోందని, దీనిని గమనిస్తున్న ఓటర్లు పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని వివరించారు.

Advertisement

రాష్ట్రంలోని మెజారిటీ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయబోతోందని, విపక్షాలకు కనీసం డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి నెలకొందని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ శ్రేణులు ఐకమత్యంతో పనిచేయాలని, ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ తిరుగులేని శక్తి అని మరోసారి నిరూపిస్తాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

ALSO READ: Dharmapuri Arvind: తెలంగాణలో జనసేనతో పొత్తు లేదు.. పవన్ ఇంకెప్పుడు వస్తారు?, ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×