E-Paper
Advertisement

Uttam Kumar: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్.. తిరుగులేని విజయం సాధిస్తున్నాం, మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు

Uttam Kumar: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్.. తిరుగులేని విజయం సాధిస్తున్నాం, మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
Advertisement

రాష్ట్రంలోని మొత్తం కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో 90 శాతానికి పైగా స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని.. మున్సిపల్ ఓటర్లలో తిరుగులేని క్లారిటీ కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు.

గడిచిన ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తూ, కాంగ్రెస్ పార్టీ వరుస విజయాలతో దూసుకుపోతోందని ఉత్తమ్ గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలుకొని ఇటీవలి సర్పంచ్ ఎన్నికల వరకు ప్రజలు కాంగ్రెస్ వైపే నిలిచారని ఆయన అన్నారు. ముఖ్యంగా కంటోన్మెంట్ ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ ఎన్నికలు, జూబ్లీహిల్స్ వంటి కీలక ప్రాంతాల్లో పార్టీ సాధించిన విజయాలు కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయని తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ మద్దతుదారులే అత్యధిక స్థానాల్లో విజయం సాధించారని.. ఇదే ఊపు మున్సిపల్ ఎన్నికల్లోనూ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే పార్టీని గెలిపిస్తాయని ఉత్తమ్ పేర్కొన్నారు. ప్రతిపక్షాల విమర్శలను ప్రజలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని, గత పదేళ్ల పాలనలో జరిగిన వైఫల్యాలను ప్రజలు ఇంకా మర్చిపోలేదని ఆయన విమర్శించారు. పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, పాలనలో పారదర్శకతకు కాంగ్రెస్ పెద్దపీట వేస్తోందని, దీనిని గమనిస్తున్న ఓటర్లు పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని వివరించారు.

Advertisement

రాష్ట్రంలోని మెజారిటీ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయబోతోందని, విపక్షాలకు కనీసం డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి నెలకొందని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ శ్రేణులు ఐకమత్యంతో పనిచేయాలని, ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ తిరుగులేని శక్తి అని మరోసారి నిరూపిస్తాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

ALSO READ: Dharmapuri Arvind: తెలంగాణలో జనసేనతో పొత్తు లేదు.. పవన్ ఇంకెప్పుడు వస్తారు?, ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×