E-Paper
Advertisement

Hyderabad News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు తీవ్ర అస్వస్థత

Hyderabad News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు తీవ్ర అస్వస్థత
Advertisement

Hyderabad News: జాబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కాసేపటి క్రితమే కుటుంబ సభ్యులు ఆయనను గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రికి బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర కీలక నేతలు, పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

గత కొన్ని రోజుల నుంచి ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ మధ్యనే ఆయనకు ఒక కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆపరేషన్ జరిగింది. ఆ తర్వాత తరువాత ఆయన ఇన్ఫెక్షన్‌తో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు సాయంత్రం 4 గంటలకు జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఏఐజీ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, ఆయన అనుచరులు భారీ చేరుకున్నారు.

Advertisement

కాగా.. ఇటీవల జరిగి బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా తెలంగాణ భవన్ ముందు భారీ కేసీఆర్ కటౌట్ ను ఎమ్మెల్యే గోపినాథ్ ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ఆయన కటౌట్ ఓపెన్ చేయించారు.

ALSO READ: Konda Surekha : కొండా సురేఖకు అస్వస్థత.. కింద పడిపోయి..

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×