E-Paper
Advertisement

Konda Surekha : కొండా సురేఖకు అస్వస్థత.. కింద పడిపోయి..

Konda Surekha : కొండా సురేఖకు అస్వస్థత.. కింద పడిపోయి..

Konda Surekha : మంత్రి కొండా సురేఖ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కేబినెట్ మీటింగ్ కోసం సచివాలయానికి వచ్చారు. మీటింగ్ హాలులోకి వెళుతుండగా కళ్లు తిరిగి పడిపోయారు. పక్కనే ఉన్న సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారు. వైద్యులను పిలిపించారు. డాక్టర్లు చెక్ చేసి.. లో బీపీ, లో షుగర్ వల్ల కళ్లు తిరిగాయని చెప్పారు.

మంత్రి కొండా సురేఖ ఉదయం నుంచి ఆహారం తీసుకోలేదని తెలుస్తోంది. ఏమీ తినకపోవడంతో షుగర్ లెవెల్స్ పడిపోయాయి. సెక్రటేరియట్‌లోనే ఎమర్జెన్సీ మెడికల్ టీమ్‌ ఆమెకు ప్రథమ చికిత్స చేసింది. ఆ తర్వాత ఆహారం తీసుకోవడంతో కొండా సురేఖ తేరుకున్నారు. కాసేపు విశ్రాంతి తీసుకుని.. కేబినెట్‌ మీటింగ్‌కు తిరిగి హాజరయ్యారు. మంత్రి మండలి సమావేశం ముగిశాక హాస్పిటల్‌కు వెళతారని తెలుస్తోంది.

సచివాలయంలో అస్వస్థతకు గురైన మంత్రి కొండా సురేఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు.  మంత్రి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను వివరాలను అడిగి తెలుసుకున్నారు.

 

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×