E-Paper
Advertisement

MLC Kavitha: కేటీఆర్ తీరుపై విరుచుకుపడ్డ కవిత.. ‘పదేళ్లు గుర్తుకురాని జిల్లా.. ఇప్పుడు ఉద్యమాలా?’

MLC Kavitha: కేటీఆర్ తీరుపై విరుచుకుపడ్డ కవిత.. ‘పదేళ్లు గుర్తుకురాని జిల్లా.. ఇప్పుడు ఉద్యమాలా?’
Advertisement

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ లక్ష్యంగా ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్‌ను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలంటూ కేటీఆర్ చేపట్టిన ఆందోళనలపై ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న సమయంలో లేని డిమాండ్, ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే గుర్తుకురావడం హాస్యాస్పదంగా ఉందని ఆమె విమర్శించారు.

అధికారంలో ఉన్నప్పుడు ఏమైంది..?

Advertisement

సికింద్రాబాద్ జిల్లా చేయాలని ప్రస్తుతం ఉద్యమం చేస్తున్న కేటీఆర్‌ను చూస్తుంటే తనకు నవ్వు వస్తోందని కవిత వ్యాఖ్యానించారు. గత పదేళ్ల కాలంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అనేక కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామని, అప్పుడు సికింద్రాబాద్‌ను జిల్లాగా మార్చే అవకాశం ఉన్నా ఎందుకు పట్టించుకోలేదని ఆమె ప్రశ్నించారు. ప్రజల అవసరాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని భావించినందువల్లే అప్పట్లో ఈ నిర్ణయం తీసుకోలేదని ఆమె ఆరోపించారు.

Advertisement

నాడు కేసులు.. నేడు ఉద్యమాలు..

గతంలో సికింద్రాబాద్‌ను జిల్లా చేయాలని కోరుతూ అనేక ప్రజా సంఘాలు, స్థానిక నాయకులు ఉద్యమాలు చేశారని కవిత గుర్తు చేశారు. అయితే, అప్పట్లో అధికారంలో ఉన్న కేటీఆర్ ప్రభుత్వం ఆ ఉద్యమకారుల గోడు వినకపోగా, వారిపై అక్రమ కేసులు పెట్టి వేధించారని ఆమె ఆరోపించారు. ‘నాడు జిల్లా కావాలని అడిగిన వారిని జైలుకు పంపిన వారే, నేడు అదే డిమాండ్‌తో వీధుల్లోకి రావడం విడ్డూరంగా ఉంది’ అని ఆమె ఎద్దేవా చేశారు.

ప్రజలను తప్పుదోవ పట్టించడమే లక్ష్యం.. 

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే పేరుతో కేటీఆర్ కేవలం రాజకీయ ఉనికి కోసమే ఇటువంటి డ్రామాలు ఆడుతున్నారని కవిత విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల ఆకాంక్షలను కాలరాసి, ఇప్పుడు అవే ఆకాంక్షల కోసం పోరాడుతున్నట్లు నటించడం ప్రజలను మోసం చేయడమేనని మండిపడ్డారు. కేటీఆర్ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని, ఆయన ద్వంద్వ ప్రమాణాలకు కాలమే సమాధానం చెబుతుందని ఆమె స్పష్టం చేశారు.

ALSO READ: Allipudi Murder Case: తెదేపా కార్యకర్త హత్య కేసులో నిందితులను రోడ్డుపై నడిపించిన పోలీసులు!

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×