E-Paper
Advertisement

తెలంగాణ ఉద్యమకారులను రేవంత్ సర్కార్ పట్టించుకోవడం లేదు.. విజయశాంతి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ఉద్యమకారులను రేవంత్ సర్కార్ పట్టించుకోవడం లేదు.. విజయశాంతి సంచలన వ్యాఖ్యలు
Advertisement

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారుల పట్ల ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఎమ్మెల్సీ విజయశాంతి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. శాసన మండలి వేదికగా ఆమె ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. స్వరాష్ట్ర కాంక్షతో పోరాడిన వారిని విస్మరించడం తగదని హెచ్చరించారు. ఉద్యమకారులు లేకుంటే నేడు అనుభవిస్తున్న పదవులు ఉండేవి కావని ఆమె గుర్తు చేశారు.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమకారులు గౌరవప్రదమైన జీవితం గడుపుతారని భావించారని.. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ పాలనలో తెలంగాణ వాదులు ఎన్నో అవమానాలు భరించారని వివరించారు. లాఠీ దెబ్బలు తిని.. జైలు పాలై.. తమ సర్వస్వాన్ని కోల్పోయి ఉద్యమాన్ని సజీవంగా ఉంచారని కొనియాడారు. అటువంటి త్యాగధనులను ప్రభుత్వం పట్టించుకోకపోవడం కొంత శోచనీయం అని పేర్కొన్నారు.

Advertisement

ఉద్యమకారులకు సంబంధించి సోనియా గాంధీ ఇచ్చిన హామీలను విజయశాంతి ఈ సందర్భంగా గుర్తు చేశారు. గతంలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల నివాస స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. వీటితో పాటు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం.. నెలకు 4 వేల రూపాయల పెన్షన్ అందించాలని కోరారు. అలాగే 10 లక్షల రూపాయల ఆరోగ్య బీమా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు.

ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు ఏండ్లు గడుస్తున్నా.. ఉద్యమకారుల సంక్షేమం దిశగా అడుగులు పడటం లేదని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నివేదికలు ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని ఆరోపించారు. ఈ ఆలస్యం వల్ల వయోవృద్ధులైన ఉద్యమకారులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన చెందారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కమిటీ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు.

Advertisement

తెలంగాణ సమాజం మొత్తం ఉద్యమకారుల కృషిని ఎల్లప్పుడూ స్మరించుకోవాలని విజయశాంతి పిలుపునిచ్చారు. వారు చేసిన త్యాగాల పునాదుల మీదనే నేడు రాష్ట్ర పాలన సాగుతోందని వెల్లడించారు. ఉద్యమకారుల సంక్షేమాన్ని విస్మరిస్తే చరిత్ర క్షమించదని పేర్కొన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి.. మంత్రులు స్పందించి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆమె డిమాండ్ చేశారు.

ALSO READ: అసలు రాష్ట్రాన్ని దోచుకున్నదే కేసీఆర్ కుటుంబం.. మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

Related News

Medchal: నడి రోడ్డు పై వరి నాట్లు.. బీఆర్ఎస్ నాయకుల వినూత్న నిరసన..!

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×