BigTV English

Kishan Reddy: తెలంగాణ ప్రభుత్వం సహకరించకున్నా సరే, యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ సేవలను పొడిగిస్తాం : కిషన్‌రెడ్డి

Kishan Reddy: తెలంగాణ ప్రభుత్వం సహకరించకున్నా సరే, యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ సేవలను పొడిగిస్తాం : కిషన్‌రెడ్డి

Central Minister Kishan Reddy :  ఎంఎంటీఎస్ సర్వీసుల పొడిగింపుపై కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకున్నా యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ (MMTS) సేవలను పొడిగిస్తామని వెల్లడించారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే పరిధి దాదాపుగాలో 90 శాతం మేర రైల్వే లైన్ల విద్యుదీకరణ పూర్తి అయ్యిందని వివరించారు.


రూ.650 కోట్లతో రైల్ తయారీ ఫ్యాక్టరీ…

అంతకుముందు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌తో తెలంగాణ ఎంపీలు సమావేశమయ్యారు. అనంతరం రైల్‌ నిలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే రైల్వే స్టేషన్లను ఆధునికీకరిస్తున్నామన్న కేంద్రమంత్రి, వరంగల్‌లో రూ.650 కోట్లతో రైల్‌ తయారీ కేంద్రాన్ని నెలకొల్పుతున్నామన్నారు. మునుపెన్నడూ లేని రీతిలో దక్షిణ మధ్య రైల్వే బడ్జెట్‌ను పెంచామని చెప్పుకొచ్చారు.


మరిన్ని వందేభారత్ రైళ్లు వస్తున్నాయ్…

మరోవైపు జోన్ పరిధిలో ఇఫ్పటికే 5 వందే భారత్‌ రైళ్లు నిత్యం ప్రయాణికులకు సేవలందిస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో త్వరలోనే మరికొన్నింటినీ ప్రవేశపెడతామన్నారు.

సికింద్రాబాద్ ముస్తాబు…

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ పనులు సైతం జోరుగా సాగుతున్నాయన్నారు. వచ్చే ఏడాది డిసెంబర్‌ నాటికి ఈ పనులు పూర్తి చేస్తామన్నారు. రూ.720 కోట్లతో పనులు పరుగులు పెడుతున్నాయన్నారు.

ఘట్‌కేసర్‌ నుంచి పొడిగింపు…

ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి కేవలం ఘట్‌కేసర్‌ వరకే  ఎంఎంటీఎస్‌ సర్వీసులు రోజూవారీగా నడుస్తున్నాయన్నారు. ఈ సర్వీసులను యాదాద్రి వరకు విస్తరించాల్సి అవసరం ఉందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ను పొడిగించాలని నిర్ణయం తీసుకున్నామని, ఇందుకు రూ.650 కోట్లు మేర నిధులు అవసరమవుతాయన్నారు. అయితే తెలంగాణ సర్కార్ సహకరించకున్నా కేంద్రం నిధులతోనే ఎంఎంటీఎస్‌ సర్వీసును పొడిగిస్తున్నట్లు స్ఫష్టం చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఎంపీలు డీకే అరుణ, రఘునందన్‌రావు, సురేష్‌రెడ్డి, కావ్య తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు ఎంపీలు తమ ప్రాంతాల్లోని రైల్వే సమస్యలను దక్షిణ మధ్య రైల్వే జీఎం దృష్టికి తీసుకెళ్లారు.

జర్నలిస్టులకు, దివ్యాంగులకు రైల్వే పాసులు…

ఈదుల నాగులపల్లి స్టేషన్‌ను అభివృద్ధి చేయాలన, కొల్లూరు, ఈదుల నాగులపల్లి రైల్వే బ్రిడ్జిని సైతం అభివృద్ధి చేయాలని ఎంపీ రఘునందన్‌ రావు కోరారు. ఇక జర్నలిస్టులు, దివ్యాంగులకు రైల్వే పాస్‌లను పునరుద్ధరించాలని, మనోహరాబాద్‌-కొత్తపల్లి రైల్వే లైన్‌ కూడా పూర్తి చేయాలని అభ్యర్థించారు.

also read : టపాసులు అమ్ముతున్నారా, అయితే మీ దుకాణాలకు ఇవి తప్పనిసరి, లేకుంటే అంతే సంగతులు : జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి

Related News

Rain: మళ్లీ అతిభారీ వర్షాలు వచ్చేస్తున్నయ్ భయ్యా.. కమ్ముకొస్తున్న పిడుగుల వాన, అలర్ట్‌గా ఉండండి..!

TGPSC Group-1: గ్రూపు-1 వివాదం కీలక మలుపు.. హైకోర్టులో మరో అప్పీలు

Medaram Maha Jatara: మేడారం మహాజాతర డిజిటల్ మాస్టర్ ప్లాన్ విడుదల

Sammakka-Saralamma: వనదేవతలు సమ్మక్క- సారలమ్మలు అన్ని గమనిస్తున్నారు.. కేంద్రంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy: సమ్మక్క-సారక్కలకు నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం రేవంత్

Heavy Rains: మరో అల్పపీడనం.. నాలుగు రోజులు వర్షాలు దంచుడే దంచుడు..

Hyderabad News: పండగ సమీపిస్తున్న వేళ.. జోరుగా నాన్ డ్యూటీ లిక్కర్, అధికారులు ఉక్కుపాదం

Hyderabad News: హైదరాబాద్‌ వాసులకు సూచన.. ఆ ప్రాంతాల్లో 24 గంటలపాటు తాగునీటి సరఫరా బంద్

Big Stories

×