MP Arvind: స్వేచ్ఛ బ్యూరో: నిజామాబాద్ ఎంపీ అరవింద్ బీజేపీ పార్టీపై సంచలన కామెంట్స్ చేశారు. బీజేపీలో లేఖలపై ఎంపీ అరవింద్ రియాక్ట్ అయ్యారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని నన్ను ఆంటే ఓకే కానీ పార్టీ కోసం అనుకూలంగా కార్యకలాపాలు చేస్తున్నారంటే మాత్రం ఉరుకోనని, అవి ఎవరు చేస్తున్నారో నాకు తెలుసని తన సొంత నేతలపైనే విరుచుకు పడ్డారు. నిజామాబాద్ పార్టీ నేతలపై ఎంపీ అరవింద్ చురకలంటించారు.
నేను ఏ లెటర్ ఎవరికీ రాయలేదని అన్నారు.ఎంపీ లక్ష్మణ్ తోనే కాదు కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్, ఇంకెవరితో నాకు ఎలాంటి గ్యాప్ లేదని అన్నారు. ఇక బీజేపీ పార్టీకి రాకేష్ రెడ్డి ఐ కాన్ అని నాకు రాకేష్ రెడ్డికి ఎలాంటి గ్యాప్ లేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ పార్లమెంట్ నుండి మెజార్టీ సీట్లు గెలిపించడానికి నా రేసులో నేను ఉన్నానని అన్నారు. ఎన్నికల రేసులో ఫస్ట్ రావడానికి తప్పా.. మిగతావి అన్ని నా ముందు లైట్ అని అన్నారు. తెలంగాణలో బీజేపీ పార్టీని ప్రభుత్వంలోకి తీసుకొచ్చే అలవాటు ఉన్న కుటుంబం నాదని ఎంపీ అరవింద్ తెలిపారు.
Also Read: ప్రభుత్వ ఆసుపత్రుల్లో బిగ్ స్కామ్.. షాక్లో ఉన్నతాధికారులు
బీజేపీ బిఅరెస్ పొత్తు ప్రచారంపై మరోసారి ఎంపీ అరవింద్ స్పందించారు. లీడర్ క్యాడర్ లేని పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని ఎద్దేవా వేశారు. నా దృష్టిలో రాజకీయంగా కెసిఆర్ అనే లీడర్ లేరని అసలు బిఆర్ఎస్ పార్టీ కూడా లేదని తేల్చి చెప్పారు. బిఆర్ఎస్ అంటే కరెప్షన్ డ్రగ్స్ అని వాళ్ళతో మాకు పొత్తేంటని చురకలంటించారు. సీఎం రేవంత్ రెడ్డి కవిత పార్టీకి ఫండిగ్ చేస్తున్నారని, రాష్ట్రంలో కులాల వారీగా ప్రజలను విడిదియడానికి ప్రణాళిక చేస్తున్నారని అన్నారు.
బీజేపీని దెబ్బతీసేందుకు రేవంత్ రెడ్డి, కవిత రహస్య ప్రణాళికలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో బిఆర్ఎస్ నుండి బీజేపీకి భారీ వలసలు ఖాయం అని ఎంపీ అరవింద్ అన్నారు. మాజీ మంత్రి జీవన్ రెడీ నా లెక్కప్రకారం తొందరపడ్డారని అన్నారు. సంజయ్ కుమార్ మళ్లీ బిఆర్ఎస్లో యాక్టివ్ అయితేమళ్లీ జీవన్ రెడ్డి పరిస్థితి ఎంటని ప్రశ్నించారు. కేటిఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరు ఒక్కటే ఇద్దరు కలిసి రాష్ట్రంలొ ఆడుతున్న డ్రామా అని ఎంపీ అరవింద్ అన్నారు.
Also Read: తెలంగాణలో మోడి టూర్కు మళ్లీ బ్రేక్.. ఇప్పట్లో లేనట్టే..!