Blackberry Island Mulugu: అమేజాన్ అడవులకు వెళ్ళి సరదాగా గడపాలని ఉంటే.. ములుగు జిల్లాకు వెళ్తే సరిపోతుంది. ఆఫ్రికా, అమెరికా అడవుల్లోని ఐలాండ్స్ కు వెళ్లాలనుకున్నా.. ములుగు జిల్లాకు వెళ్తే సరిపోతుంది. అవును నిజమే, ములుగు జిల్లా ఇప్పుడు పర్యాటకుల స్వర్గధామం. రామప్ప దేవాలయం, బోగత జలపాతాలు, గోదావరి నది, లక్నవరం టూరిజం, తాడ్వాయి హాట్స్ , జంగిల్ సఫారీతో పాటుగా.. ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిన బ్లాక్ బెర్రీ ఐలాండ్ అందుబాటులోకి వచ్చింది.
ములుగు జిల్లాలోని పస్రా-తాడ్వాయి గ్రామాల శివారు అటవీ ప్రాంతంలో.. బ్లాక్ బెర్రీ ఐలాండ్ ను అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఆఫ్రికా, అమెరికా అడవుల్లో ఉండే ఐలాండ్ లను ఈ బ్లాక్ బెర్రీ ఐలాండ్ తలపిస్తోంది. వరంగల్ నుండి భూపాలపట్నం వెళ్ళే జాతీయ రహదారి163కి పక్కనే ఈ ఐలాండ్ ఉంది. పస్రా నుండి 7కిలోమీటర్ల తర్వాత అడవిలోపలికి 1కిలోమీటర్ దూరంలో.. జలగలంచ పరీవాహక ప్రాంతంలో ఐలాండ్ ను ఏర్పాటు చేశారు.
కాగా ఈ బ్లాక్ బెర్రీ ఐ ల్యాండ్ను మంత్రి సీతక్క ప్రారంభించిన సంగతి తెలిసిందే. ములుగు జిల్లా పర్యటకులకు నిలయమని, ఇక్కడి పర్యాటక ప్రాంతాలు సందర్శకులను ఆకర్షిస్తాయని మంత్రి సీతక్క తెలిపారు. పర్యాటకులకు బ్లాక్ బెర్రీ ఐ ల్యాండ్ను సందర్శించాల్సిందిగా ఆమె కోరారు.