Munugodu Political History : మునుగోడు నియోజకవర్గంలో ఏడు మండలాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గం… అత్యంత రాజకీయ చైతన్యం కలిగిన నియోజకవర్గంగా చెప్పవచ్చు. 1967 లో తొలిసారి మునుగోడు నియోజకవర్గానికి ఎన్నికలు జరిగాయి. ముందు నుంచి కాంగ్రెస్కు కంచుకోటగా ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి పాల్వాయి గోవర్ధన్రెడ్డి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మునుగోడులో కమ్యూనిస్టుల ప్రాబల్యం కూడా ఎక్కువే. ఉజ్జిని నారాయణరావు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 లో టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో కోమటిరెడ్డి రాజ్గోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఇప్పుడు కాంగ్రెస్కు రాజీనామా చేసిన రాజ్గోపాల్ రెడ్డి… బీజేపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. హోరాహోరీగా జరిగిన ఉపఎన్నికలో 93.13 శాతం భారీ పోలింగ్ నమోదయింది. మునుగోడు నియోజకవర్గంలో మొత్తం 2లక్షల 41వేల 855 మంది ఓటర్లు ఉండగా, వారిలో 2లక్షల 25వేల 192 మంది ఓటు వేశారు. ఇందులో 686 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి. ఉపఎన్నిక బరిలో 47 మంది అభ్యర్థులు నిలవగా…. ఓటరు ఎవరి పట్టం కట్టారో ఇవాళ తేలనుంది.