E-Paper
Advertisement

Kalvakuntla kavitha: అన్యాయం చేశా! ఆ కుటుంబాలకు బహిరంగ క్షమాపణ.. కవిత సంచలనం

Kalvakuntla kavitha: అన్యాయం చేశా! ఆ కుటుంబాలకు బహిరంగ క్షమాపణ.. కవిత సంచలనం
Advertisement

Kalvakuntla kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తిరిగి ప్రజల్లోకి అడుగుపెట్టారు. జనం బాట యాత్రను ప్రారంభించారు. శనివారం ఉదయం తన నివాసంలో పూజలు చేసి.. అనంతరం గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ..

తెలంగాణ ప్రజలంతా బాగుండాలన్న లక్ష్యంతో తెచ్చుకున్న అమరవీరులు, ఉద్యమకారులు ఆశయాలు నెరవేరలేదన్నారు. అందుకే ఆత్మగౌరవంతో కూడిన అందరి అభివృద్ధి కోసం.. సామాజిక తెలంగాణ సాధనకు జాగృతి పోరాడుతుందన్నారు.

Advertisement

ఉద్యమకారుల కోసం తాను కొట్లాడలేకపోయినందుకు కవిత బహిరంగంగా క్షమాపణ చెప్పారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో 1200 మంది అమరుల ఆశయాలు నెరవేర్చడంలో వెనుకబడ్డామన్నారు. 580 మంది కుటుంబాలకు రూ.10లక్షలు, ఉద్యోగంతో  సరిపెట్టిందన్నారు. కానీ ఇంకా అనేక కుటుంబాలు సహాయం కోసం ఎదురుచూస్తున్నాయని వివరించారు. మన రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన వారి కుటుంబాలు ఇంకా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి. వారి పిల్లలకు విద్య, ఉపాధి, గౌరవం అందించడంలో మనం వెనుకబడ్డాం.

ఇప్పటికీ ఉద్యమకారుల ఫోరంల పేరుతో ప్రతి మండలంలో ఇంకా ఆందోళన చేస్తున్నారని కవిత గుర్తు చేశారు. ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు పోరాడలేకపోయినందుకు విచారం వ్యక్తం చేశారు. అమరవీరుల కుటుంబాలకు కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Advertisement

Also Read: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం

ఉద్యమ సమయంలో వెన్నెముకగా నిలిచినవారే, రాష్ట్రం వచ్చిన తర్వాత పక్కన పడిపోయారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కొంతమంది ఉద్యమకారులకే లభించాయి కానీ, సాధారణ ఉద్యమ సైనికులకు మాత్రం న్యాయం జరగలేదని తెలిపారు.

Related News

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

Big Stories

Advertisement
×