E-Paper
Advertisement

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్ రావుకు బిగ్ షాక్..!

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్ రావుకు బిగ్ షాక్..!

Phone Tapping Case: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు తీర్పుని రిజర్వ్ చేసింది.

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ4గా ఉన్న నిందితుడు రాధాకిషన్ రావు బెయిల్ కోసం ఇటీవలే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాధాకిషన్ రావు పిటిషన్ పై నాంపల్లి కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఇరువర్గాల వాదనలు విన్న నాంపల్లి కోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.

రాధాకిషన్ బెయిల్ పిటిషన్ పై రిజర్వ్ చేసిన తీర్పును మే 2న కోర్టు వెల్లడించనుంది. రాధా కిషన్ రావుకు బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. ఇప్పటికే రాధా కిషన్ రావు జ్యుడీషియల్ రిమాండ్ ముగిసింది. పోలీస్ కస్టడీ కూడా పూర్తయిందని కొర్టుకు ఉమామహేశ్వరావు తెలిపారు.

Also Read: కాంగ్రెస్, బీఆర్ఎస్ వేర్వేరు కాదు.. ఒకే గూటి పక్షులు: ప్రధాని మోదీ

ఇటీవలే ఈ కేసులో నిందితులుగా ఉన్న భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావుల బెయిల్ పిటిషన్లను కూడా నాంపల్లి కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో భాగంగా పోలీసుల వాదనలతో ఏకీభవించిన కోర్టు నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది.

Tags

Related News

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Big Stories

×