Junior College: స్వేచ్ఛ బ్యూరో: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆధునిక సౌకర్యాలతో నిర్మించనున్నట్లు ఎంఎల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి తెలిపారు. ప్రస్తుత కళాశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో ఇటీవల 9కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయి. ఈ క్రమంలో నూతన భవన నిర్మాణ పనులకు గతంలో ఇంఛార్జ్ మంత్రి దామోదర శంకుస్థాపన చేశారు. కళాశాలలకు వేసవి సెలవులు రావడం వల్ల పనులను ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా ఎంఎల్సీ దామోదర్ రెడ్డి ఇంజనీరింగ్, ఇంటర్మీడియట్ శాఖ అధికారులతో కలిసి కళాశాలను పరిశీలించారు.
Also Read: YSRCP : కూటమి గెలుపుపై వైసీపీ కొత్త స్వరం.. మీరూ అలాగే చేశారా?
ఈ సందర్భంగా ఎంఎల్సీ మాట్లాడుతూ.. దశాబ్దాల చరిత్ర ఉన్న ఈ కళాశాలను గత పాలకులు పట్టించుకోక, శిథిలావస్థకు చేరిందన్నారు. ప్రస్తుత విద్యా అవసరాలనలకు, రాబోయే కాలానికి అనుగుణంగా ఆధునిక వసతులతో కళాశాలను నిర్మించడం జరుగుతుంది అన్నారు. ఏడాదిన్నరలో పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో.. ఇంటర్మీడియట్ జిల్లా అధికారి వెంకటరమణ, మున్సిపల్ ఛైర్మన్ తీగల సునేంద్ర, కళాశాల ప్రిన్సిపాల్ మాధవి, కాంగ్రెస్ టౌన్ అధ్యక్షులు జక్కా రాజు, తదితరులు ఉన్నారు.
Also Read: ఆ పథకానికి ప్రభుత్వం స్వాహా.. 62 వేల చీరలను వెనక్కి పంపిన సర్కార్!