BigTV English

IAS Officer Srilakshmi: ఓబులాపురం మైనింగ్ కేసులో.. IAS శ్రీలక్ష్మికి హైకోర్టు బిగ్ షాక్‌

IAS Officer Srilakshmi: ఓబులాపురం మైనింగ్ కేసులో.. IAS శ్రీలక్ష్మికి హైకోర్టు బిగ్ షాక్‌

IAS Officer Srilakshmi: ఓబులాపురం మైనింగ్ కేసులో ఇవాళ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఓబులాపురం మైనింగ్ కేసులో IAS అధికారి శ్రీలక్ష్మి రివిజన్ పిటిషన్‌ను కొట్టేసింది. గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన OMCకి గనులు కేటాయించడంలో శ్రీలక్ష్మి కీలకపాత్ర పోషించారనే అభియోగం ఉంది. ఇప్పుడు పిటిషన్ కొట్టేయడంతో సీబీఐ ఆమె పాత్రపై విచారణ చేపట్టనుంది.


శ్రీలక్ష్మి నిర్దోషి అంటూ గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది CBI. హైకోర్టులోనే OMC కేసులో శ్రీలక్ష్మి పాత్ర తేల్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో విచారణ జరిపి ఇరు వాదనలు విన్న హైకోర్టు.. ఆమె డిశ్చార్జ్‌ పిటిషన్‌ను కొట్టేసింది.

గాలి జనార్ధన్ రెడ్డి ఓబులాపురం మైనింగ్ పేరుతో దోపిడీ చేసిన సమయంలో ప్రభుత్వంలో మైనింగ్ శాఖ ఉన్నతాధికారిగా శ్రీలక్ష్మి ఉన్నారు. లీజుల్లో అవకతవకలు దగ్గర నుంచి గాలి జనార్ధన్ రెడ్డి కంపెనీలకు అర్హత లేకపోయినా లీజులు కట్టబెట్టడం వరకూ చాలా తప్పులు ఆమె చేతులు మీదుగా జరిగాయని సీబీఐ కేసులు పెట్టింది. గాలి జనార్ధన్ రెడ్డి నుంచి ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందినట్లుగా ఆరోపించారు. అయితే ఈ కేసుతో తనకు ఏం సంబంధం లేదని సీబీఐ కోర్టు డిశ్చార్జ్ పిటిషన్ వేశారు. కానీ సీబీఐ కోర్టు కొట్టి వేసింది. అదే పిటిషన్‌ను హైకోర్టులో వేశారు. 2022లో ఆమెను కేసు నుంచి డిశ్చార్డ్ చేస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది.


Also Read: మనుషులే వంతెనగా మారి.. 35 మంది విద్యార్థులను దాటించి.. వైరల్ వీడియో

హైకోర్టు తాము చూపించిన ఆధారాలను పరిగణనలోకి తీసుకోకుడా డిశ్చార్జ్ చేశారని సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టింది. మళ్లీ హైకోర్టులోనే విచారణ జరపాలంది. ఇప్పుడీ విచారణ ముగిసిన అనంతరం డిశ్చార్జ్‌ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. దీంతో ఆమె పాత్రపై సీబీఐ విచారణ జరపనుంది.

Related News

Hyderabad Water Cut: హైదరాబాద్‌ ప్రజలకు అలర్ట్.. నగరంలో రెండు రోజులు తాగునీటి సరఫరా బంద్.. ఈ ప్రాంతాలపై ఎఫెక్ట్

Telangana: భయం గుప్పిట్లో చందనపల్లి గ్రామం.. నెల రోజుల్లో 20 మంది బలి

CM Progress Report: దేశానికే ఆదర్శం టీ -ఫైబర్.. ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా తెలంగాణ

Telangana Bandh: ఈనెల 14న తెలంగాణ రాష్ట్రా బంద్.. ఎందుకంటే..?

Global Study Expo 2025: గ్లోబల్ స్టడీ ఎక్స్‌పో- 2025, తక్కువ ఖర్చుతో విదేశీ విద్య, స్టూడెంట్స్ మాటల్లో

Hyderabad Accident: ఎల్‌బీనగర్‌ సమీపంలో రోడ్డు ప్రమాదం, బైక్‌ని ఢీ కొట్టిన కారు, నుజ్జుయిన కారు

Innovation Hub: ఈ రెండు జిల్లాలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఇంక్యూబేషన్ కేంద్రాల ఏర్పాటు: శ్రీధర్ బాబు

Vemulawada Temple: రాజన్న దర్శనాల్లో తాత్కాలిక మార్పులు.. రేపటి నుంచి భీమేశ్వరాలయంలో దర్శనాలు

Big Stories

×