E-Paper
Advertisement

Telangana : బీసీలకు రూ. లక్ష ఆర్థికసాయం.. ఇక ఒక్కరోజే గడువు..

Telangana : బీసీలకు రూ. లక్ష ఆర్థికసాయం.. ఇక ఒక్కరోజే గడువు..

Telangana today news(Telugu news updates): తెలంగాణలో బీసీ కులవృత్తుల కుటుంబాలకు రూ.లక్ష ఆర్థికసాయాన్ని ప్రభుత్వం ప్రకటించగానే భారీగా స్పందన వచ్చింది. మీసేవ కేంద్రాలకు జనం క్యూ కట్టారు. అయితే ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీ ఆలస్యమవుతోంది. దీంతో దరఖాస్తుదారులకు ఇబ్బందులు ఎదురువుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా బీసీ కులవృత్తుల వారు కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. ఈ పథకానికి ఈనెల 20తో దరఖాస్తు గడువు ముగియనుంది. దీంతో ఇంకా దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయని వారు ఆందోళన చెందుతున్నారు.

ఇప్పటికే రూ.లక్ష ఆర్థికసాయం పథకానికి 3 లక్షల మందికిపైగా దరఖాస్తు చేశారు. ఎంబీసీలతోపాటు 14 కులాలు ఈ పథకానికి అర్హులుగా ప్రభుత్వం పేర్కొంది. ఆన్‌లైన్‌ లో దరఖాస్తు చేసుకోవాలి. ఆదాయ ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా సమర్పించాలి. ఈ పత్రాలను వెంటనే మంజూరు చేసేలా చూడాలని జిల్లా కలెక్టర్లకు మంత్రివర్గ ఉపసంఘం సూచించింది.

కానీ క్షేత్రస్థాయిలో ఈ ప్రక్రియ సరిగా సాగడంలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే 2021 ఏప్రిల్‌ 1 నుంచి జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రాలను పరిగణనలోకి తీసుకుంటామని ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసిన వారం రోజుల్లోగా ధ్రువీకరణ జారీ చేయాలని పైఅధికారులు ఆదేశించారు. కానీ మండల కార్యాలయాల్లో జాప్యం జరుగుతోంది.

మీసేవ, ఆన్‌లైన్‌ కేంద్రాలు కులవృత్తుల కుటుంబాల నుంచి దరఖాస్తు ఫీజును రూ.200 వరకు వసూలు చేస్తున్నాయని ఆరోపణలు వచ్చాయి. స్మార్ట్‌ఫోన్‌ నుంచి దరఖాస్తు చేసేలా ఏర్పాట్లు చేశారు. కానీ అవగాహన లేకపోవడంతో దరఖాస్తు దారులు ఆన్‌లైన్‌ కేంద్రాలకే వెళుతున్నారు. కొన్ని మీసేవా కేంద్రాల్లో ఆదాయ ధ్రువీకరణ పత్రాలు వేగంగా ఇప్పిస్తామంటూ రూ. వెయ్యి వరకు తీసుకున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

రూ.లక్ష ఆర్థికసాయం దరఖాస్తు గడువు పొడిగించాలని బీసీ కులవృత్తుల కుటుంబాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. గడువును జూన్‌ నెలాఖరు వరకు పొడిగించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌కు లేఖ రాశారు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×