Rangareddy News: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు క్రమంగా వేడి రాజుకుంటోంది. విత్ డ్రాలకు సమయం దగ్గరపడుతుండడంతో ప్రత్యర్థుల నుంచి వేధింపులు మొదలయ్యాయి. ఈ క్రమంలో అభ్యర్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అలాంటి ఘటన ఒకటి రంగారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది.
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల వేడి
పంచాయతీ ఎన్నికలంటే ఆ వేడి మామూలుగా ఉండదు. గ్రామాల్లో అభ్యర్థులు బలాబలాలను ప్రదర్శించుకునేందుకు ప్రయత్నం చేశారు.. చేస్తుంటారు. ప్రత్యర్థులపై పైచేయి సాధించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటారు. రంగారెడ్డి జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. సదరు వ్యక్తి ఆత్మహత్య వెనుక ప్రత్యర్థుల బెదిరింపులు కారణమనే వాదలు లేకపోలేదు.
రంగారెడ్డి జిల్లాలో ఫరూక్ నగర్ మండలం కంసాన్పల్లి గ్రామానికి చెందినవాడు 25 ఏళ్ల అవ శేఖర్. మంగళవారం అర్థరాత్రి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పంచాయతీ ఎన్నికల్లో తన గ్రామం నుంచి వార్డు మెంటర్గా పోటీ చేస్తున్నాడు. అయితే ఎన్నికల నుంచి తప్పుకోవాలంటూ ప్రత్యర్థుల నుంచి బెదిరింపులు వచ్చినట్టు స్థానికులు చెబుతున్నారు.
ప్రత్యర్థుల వేధింపులకు ఓ అభ్యర్థి ఆత్మహత్య
గడిచిన రెండు మూడురోజులుగా ప్రత్యర్థుల నుంచి పదే పదే వేధింపులు తీవ్రమయ్యాయి. మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శేఖర్ ఆత్మహత్య తెలియగానే ఘటనా స్థలానికి వచ్చారు శేఖర్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు. అతడి మృతి దేహాన్ని బోరున విలపించారు. శేఖర్ ఆత్మహత్యకు కారణమైన వారిని అరెస్ట్ చేయాలని ఆందోళనకు దిగారు.
ఆధార్ కార్డు ఆధారంగా మృతుడిని శేఖర్గా గుర్తించారు రైల్వే పోలీసులు. పోస్టుమార్టం కోసం శేఖర్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదిలావుండగా కంసాన్పల్లి గ్రామ ప్రజలు పెద్దఎత్తున గుమ్మిగూడి ఆందోళనకు దిగారు.
ALSO READ: పాఠశాలలో ర్యాగింగ్ దుమారం.. పలువురు స్టూడెంట్స్ సస్పెండ్
శేఖర్ ఆత్మహత్యకు కొందరి బెదిరింపులు కారణమని బలంగా చెబుతున్నారు. వారిని కచ్చితంగా అరెస్టు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఆ గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగారు. ఎలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.