Bhuvanagiri News: తెలుగు రాష్ట్రాల్లో రోజుకో ప్రాంతంలో ర్యాగింగ్ భూతం జడలు విప్పుతోంది. ఇటీవల కాలంలో ఆ తరహా ఘటనలు రెట్టింపు అవుతున్నాయి. ఒకప్పుడు డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీల్లో ర్యాగింగ్ ఘటనలు వెలుగు చూసేవి. ఇప్పుడు పాఠశాలలకు పాకింది. తాజాగా అలాంటి ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజాపేట సాంఘిక సంక్షేమ గురుకులం పాఠశాలలో బయటపడింది.
పాఠశాలలో ర్యాగింగ్ దుమారం
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేటలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ దుమారం రేపింది. అర్ధరాత్రి వేళ అరడజను పదో తరగతి విద్యార్థులపై దాదాపు 20 మంది ఇంటర్ విద్యార్థులు ఒక్కసారిగా దాడి చేశారు. పదో తరగతి విద్యార్థులు ఎదురించే క్రమంలో పలువురు గాయపడ్డారు. అడ్డొచ్చినవారిని కర్రలు, క్రికెట్ బ్యాట్లతో దాడికి పాల్పడ్డారు.
దాడి చేసినవారంతా ఇంటర్ సెకండియర్ స్టూడెంట్స్ అని తెలుస్తోంది. ఈ తతంగాన్ని సెల్ఫోన్లతో చిత్రీకరించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గాయపడిన విద్యార్థులను వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ట్రీట్ మెంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఘటన విషయం తెలియగానే బాధిత తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
టెన్త్ విద్యార్థులపై ఇంటర్ స్టూడెంట్స్ దాడి
పాఠశాల ప్రిన్సిపల్, యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ర్యాగింగ్ విషయం బయటికి తెలియగానే ఐదుగురు విద్యార్థులను హాస్టల్ యాజమాన్యం సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై పాఠశాలల ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
ALSO READ: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. ఢిల్లీలో బిజీగా సీఎం రేవంత్రెడ్డి, ప్రముఖులకు ఆహ్వానాలు
ర్యాగింగ్ కలకలం.. పదో తరగతి విద్యార్థులపై ఇంటర్ విద్యార్థుల దాడి
యాదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ర్యాగింగ్
రాజపేట గురుకుల కళాశాలలో ఆరుగురు పదో తరగతి విద్యార్థులపై క్రికెట్ బ్యాట్లతో దాడి చేసిన ఇంటర్ విద్యార్థులు
ఈ ఘర్షణలో విద్యార్థులకు తీవ్ర గాయాలు
ర్యాగింగ్ విషయం… pic.twitter.com/4rANBseaOr
— BIG TV Breaking News (@bigtvtelugu) December 3, 2025