E-Paper
Advertisement

Patanjali: “రామేశ్వరంలో కాకులు.. మరికొన్ని కథలు”.. తెలుగు కవికి కేంద్ర సాహిత్య పురస్కారం..

Patanjali:  “రామేశ్వరంలో కాకులు.. మరికొన్ని కథలు”..  తెలుగు కవికి కేంద్ర సాహిత్య పురస్కారం..
Advertisement

Patanjali: ప్రముఖ తెలుగు కథా, నవలా రచయిత పతంజలి శాస్త్రిని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఆయన రాసిన “రామేశ్వరం కాకులు ..మరికొన్ని కథలు” అనే లఘ కథల పుస్తకానికి ఈ అత్యున్నత పురస్కారం లభించింది. ఢిల్లీలోని ఫిరోజ్‌ షా రోడ్డులో రబీంద్ర భవన్‌లోని సాహిత్య అకాడమీ కాన్ఫరెన్స్‌ హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రకటించారు. దేశ వ్యాప్తంగా 24 భాషల్లో రచించిన కథలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను ప్రకటించింది.

పతంజలి శాస్త్రి 1945లో పిఠాపురంలో జన్మించారు. ఆయన ఒంగోలు కళాశాలలో చదువుకున్నారు. ఉన్నత విద్యను తిరుపతి, పుణెలో చదివారు. పుణెలోని ప్రతిష్ఠాత్మక దక్కన్ కాలేజీ నుంచి పురావస్తు శాస్త్రంలో డాక్టరేట్ అందుకున్నారు. అధ్యాపకుడిగా, ప్రిన్సిపల్ గా పతంజలి శాస్త్రి పని చేశారు. వడ్ల చిలుకలు, పతంజలి శాస్త్రి కథలు, నలుపెరువు వంటి కథా సంపుటాలు ఆయన రచనల్లో ముఖ్యమైనవి. రామేశ్వరం కాకులు నుంచి రోహిణి కథ వరకూ పలు కథలను “రామేశ్వరం కాకులు.. మరికొన్ని కథలు” పేరిట పుస్తకంగా రచించారు. దీనికే ఇప్పుడు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది.

Tags

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×