Peddapalli Bus Depot: పెద్దపల్లి జిల్లాలో రవాణా సౌకర్యాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బస్ డిపో నిర్మాణ పనులను ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి పరిశీలించారు.
డిపో పనుల పురోగతిని సమీక్షిస్తూ.. నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. సహచర మంత్రి శ్రీధర్ బాబు అందించిన వివరాల మేరకు పనులు త్వరితగతిన పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. పెద్దపల్లి బస్ డిపో నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. గత ప్రభుత్వ కాలంలో జిల్లా అభివృద్ధి నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. కోట్ల రూపాయల బస్సు ఛార్జీలను భరించి ప్రజలకు ఉపశమనం కల్పిస్తున్న ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానిదని కొనియాడారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సదుపాయాలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు.
Also Read: “నీ ఏడుపే బీజేపీకి శాపం” అంటూ ఈటల రాజేందర్ ఫ్లెక్సీలు కలకలం
పెద్దపల్లి బస్ డిపో పనులను పరిశీలించిన మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు
పెద్దపల్లి జిల్లాలో మంత్రి పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబుతో కలిసి బస్ డిపో నిర్మాణ పనులను పరిశీలించారు.
గ్రామీణ రవాణా అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, పనులను త్వరగా పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. pic.twitter.com/Wigg44VhpZ
— BIG TV Breaking News (@bigtvtelugu) May 31, 2026