E-Paper
Advertisement

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఏం జరుగుతోంది..? స్పీడ్ తగ్గిందా..?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఏం జరుగుతోంది..? స్పీడ్ తగ్గిందా..?
Advertisement

Phone Tapping Case Investigation: తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏం జరుగుతోంది? కేసు దర్యాప్తు స్పీడ్ తగ్గిందా? కీలక వ్యక్తుల కోసం పోలీసులు వెయిట్ చేస్తున్నారా? ఇంతకీ వాళ్లు హైదరాబాద్‌కు వస్తారా? అమెరికా నుంచి మరేదైనా దేశానికి వెళ్లారా? దర్యాప్తు మళ్లీ వేగవంతం అవుతుందా? ఇలా రకరకాల ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ కేసు కాస్త సైలెంట్ అయ్యింది. ఈ కేసులో నలుగురు పోలీసు ఉన్నతాధికారులు అరెస్ట్ అయ్యారు. వారిలో ప్రణీత్‌రావు, రాధా కిషన్‌రావు, భుజంగరావు, తిరుపతన్నలను పోలీసులు విచారించారు. వారి నుంచి కీలక విషయాలు రాబట్టారు. ఫోన్ ట్యాపింగ్ వెనుక ఏం జరిగింది, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో డబ్బును ఎక్కడెక్కడకు తరలించారు. ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ చేశారు. అనే విషయాలపై జరిగినదంతా పూస గుచ్చినట్టు దర్యాప్తు అధికారులకు తెలిపారు. ప్రస్తుతం వీళ్లంతా రిమాండ్ ఉన్నారు.

Advertisement

నిందితుల నుంచి కీలక సమాచారం తీసుకున్నారు పోలీసులు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావు అమెరికా వెళ్లారు. వారిద్దరు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసుకు ఫుల్‌స్టాప్ పెట్టాలంటే వీరిద్దరినీ విచారించాలి. అందుకే వీరిపై ఇంటర్ పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

Also Read: తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా.. ఫోన్ టాపింగ్ కేసుపై కేసీఆర్ రియాక్షన్

Advertisement

ఇందుకోసం న్యాయస్థానం అనుమతులు తీసుకున్నారు పోలీసులు. తాను జూన్‌ చివరి నాటికి హైదరాబాద్‌కు వస్తానని ప్రభాకర్‌రావు చెబుతున్నారు. ఈలోగా వీరిద్దరు అమెరికా నుంచి మరో దేశానికి వెళ్తే ఆచూకీ తెలుసుకోవడం కష్టమవుతుందని భావిస్తున్నారు పోలీసులు. అందుకే ఎక్కడున్నా మే నెల చివరినాటికి హైదరాబాద్‌కు రప్పించేలా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించాలని భావిస్తున్నారు పోలీసులు.

అధికారులు మాత్రం దర్యాప్తును కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పటివరకు సేకరించిన సమాచారాన్ని క్షుణ్నంగా క్రోడీకరించే పనిలోపడ్డారు. నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా మరికొందరి నుంచి సమాచారం సేకరించే పనిలో పోలీసులు ఉన్నట్లు సమాచారం. ఈ కేసు పూర్తి అయ్యేనాటికి ఇంకెన్ని పెద్ద తలకాయలు బయటకు వస్తాయో చూడాలి.

Tags

Related News

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

Big Stories

Advertisement
×