E-Paper
Advertisement

MP Laxman: చరిత్ర హీనులుగా మిగిలిపోతారా? లేక దోషులకు శిక్ష వేస్తారా : ఎంపీ లక్ష్మణ్

MP Laxman: చరిత్ర హీనులుగా మిగిలిపోతారా?  లేక దోషులకు శిక్ష వేస్తారా : ఎంపీ లక్ష్మణ్

MP Laxman Comments On Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దోషులకు శిక్ష పడేవరకూ బీజేపీ పోరాటం చేస్తుందని బీజేపీ సీనియర్ నేత, ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. చరిత్ర హీనులుగా సీఎం రేవంత్ రెడ్డి మిగిలిపోకూడదంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దోషులకు శిక్ష పడేలా చూడాలని అన్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చూస్తూ ఇందిరా పార్క్ వద్ద శుక్రవారం జరిగిన ధర్నాలో ఎంపీ లక్ష్మణ్ మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ కంటే ఎక్కువ పార్లమెంట్ సీట్లను బీజేపీ గెలుస్తుందని అన్నారు. కేసీఆర్ అవినీతిని అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ చాలా సార్లు ప్రస్తావించారని తెలిపారు. ప్రస్తుతం ఏ సమస్యపై ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉప ఎన్నికల్లో ఓట్లను కొనుగోలు చేయడానికి, ప్రత్యర్థులను దెబ్బకొట్టడానికి ఫోన్ ట్యాపింగ్ వాడిందని తెలిపారు. అరెస్ట్ అయిన వాళ్లు వాంగ్మూలం ఇచ్చినా మిగిలిన వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. టెలికాం రెగ్యులేటరీ నిబంధనలకు విరుద్ధంగా కేంద్రం అనుమతి లేకుండా కేసీఆర్ సర్కార్ ఫోన్ ట్యాపింగ్ చేసిందని తెలిపారు.

Also Read:  ఫోన్ ట్యాపింగ్‌పై సెంట్రల్ దృష్టి, డీటేల్స్ కావాలంటూ…

బీజేపీ సీనియర్ నేత బీఎల్ సంతోష్‌పై  కేసీఆర్ అక్రమ కేసులు పెట్టించారని  ఆరోపించారు. లిక్కర్ కేసు నుంచి కవితను తప్పించడం కోసం బీజేపీ నేతలపై కేసులు పెట్టడం దర్మార్గం అని అన్నారు. అంతే కాకుండా బీఆర్ఎస్ నీచ రాజకీయాలకు పాల్పడిందని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే ఫోన్ ట్యాపింగ్ కేసులో దోషులకు శిక్ష పడేలా చేయాలని డిమాండ్ చేశారు.

Related News

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

Big Stories

×